Raashi Khanna : కియారా భర్త ఆమెకే సొంతం.. నెటిజన్ కామెంట్స్ కి ఘాటు రిప్లై..!

Raashi Khanna : గత సంవత్సరం ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.. అయితే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన సిద్ధార్థ్ తో రాశీ ఖన్నా పెళ్లి జరిగి ఉంటే బాగుండేది అంటూ నెటిజెన్ల నుంచి కామెంట్లు రావడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా , టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇటీవల నటించిన చిత్రం యోధ.. ఈ సినిమా మార్చి 15వ తేదీన రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా( Raashi Khanna ) జంట బాగుందని.. ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారని.. ఒకరికి ఒకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్లు ఇటు అభిమానులు కూడా కామెంట్ చేశారు.. అయితే ఈ కామెంట్లు ఇక్కడితో ఆగిపోలేదు.. కొంతమంది మరి కాస్త చనువు తీసుకొని రాశీ ఖన్నా , సిద్ధార్థ మల్హోత్రా ను వివాహం చేసుకొని ఉండి ఉంటే బాగుండేది అని కూడా కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఇవి కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

నెటిజెన్స్ కామెంట్స్ పై రాశిఖన్నా ఫైర్..

ఇకపోతే గతంలో సిద్దార్థ్ మల్హోత్రా,  కియారా అద్వానీతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.. ఆల్రెడీ పెళ్లయిపోయిన సిద్దార్థ్ తో రాశిఖన్నా పెళ్లి అయితే బాగుండు అంటూ కామెంట్స్ చేయడంతో ఈ ముద్దుగుమ్మ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ రాశీఖన్నాను దీని గురించి ప్రస్తావించగా.. ఆమె మాట్లాడుతూ …అభిమానులకు,  ప్రేక్షకులకు వారు చూసే నటీనటులపై వివిధ అభిప్రాయాలు ఉండవచ్చు.. వారు తీసే సినిమాలు.. కలిసిన నటించే వారితో రకరకాల అభిప్రాయాలు కూడా ఉండవచ్చు.. కానీ వారికి మా వ్యక్తిగత జీవితం గురించి తెలియదు.. సినిమాలో కలిసి అందంగా కనిపించినంత మాత్రానా,  సినిమాలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించినంత మాత్రానా బయట అది సాధ్యపడదు.. రియాల్టీలో అవి జరగకపోవచ్చు కూడా .. ఆన్ స్క్రీన్ మీద మా కెమిస్ట్రీ వారికి నచ్చి అలా మాట్లాడి ఉండవచ్చు.. సినిమా వేరు.. నిజ జీవితం వేరు.. దయచేసి ఇలాంటివి మళ్లీ మాట్లాడకండి అంటూ నెటిజన్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికి అయితే రాశీ ఖన్నా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
రాశీ ఖన్నా కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ వైపుగా అడుగులు వేసింది.. ఇక తాజాగా నటించిన యోధ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో ఈమెకు  బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి అనడంలో అసలు లేదు… ఏది ఏమైనా బాలీవుడ్లో రాశిఖన్నా జాక్పాట్ కొట్టిందనడం లో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు