Mahesh Babu : చాదస్తం వదిలి సెట్స్ పైకి ?

మహేష్ బాబుకు స్క్రిప్ట్ చెప్పి ఒప్పించడం ఈ మధ్య కాలంలో దర్శకులకు పెద్ద టాస్క్ అయిపోతుంది. ఫుల్ స్క్రిప్ట్ విన్నాకే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. స్టోరీ ఏ మాత్రం నచ్చకపోయినా, మొహమాటం లేకుండా పక్కకు పెట్టేస్తున్నాడు. ‘మహర్షి’ తో హిట్ అందుకున్న మహేష్, తర్వాత సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేస్తాడని ప్రచారం సాగింది. కానీ, మిడ్ రేంజ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తయ్యాక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ఉంటుంది అనుకున్నారు. కానీ, వంశీతో కాకుండా, మరో మిడ్ రేంజ్ దర్శకుడు పరశురామ్ కు ఛాన్స్ ఇచ్చాడు. సుకుమార్, వంశీ చెప్పిన స్టోరీలు నచ్చకపోడంతో మహేష్ పక్కన పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే సీన్ త్రివిక్రమ్ విషయంలో కూడా రిపీట్ అవుతుందేమో అందరు అనుకున్నారు.

మహేష్ కు కథ చెప్పడానికి సుకుమార్ ఏకంగా దుబాయ్, జర్మనీ వరకు వెళ్లాడు. ఈ రెండు సార్లు కూడా సగం సగం అన్నట్టు ఓకే చేశాడని తెలుస్తుంది. మహేష్ ఈ మధ్యనే విదేశాల నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. త్రివిక్రమ్ చెప్పిన ఫైనల్ వెర్షన్ కూడా విన్నాడట. కానీ, ఓకే చెప్పడానికి 3 రోజులకు పైగా టైం తీసుకున్నాడు అని సమాచారం. త్రివిక్రమ్ సినిమాను కూడా మహేష్ పక్కన పెట్టేస్తాడేమో అని మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఫైనల్ గా మహేష్ చాదస్తాన్ని పక్కన పెట్టేసి ఓకే చెప్పేశాడని సమాచారం. జూలై 28 నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందట. సినిమా షూటింగ్ 4 నెలల్లో ఫినిష్ అయ్యేలా ప్లానింగ్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే 2023 సంక్రాంతి బరిలో ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు