Mahesh Babu : ఆ దర్శకులతో సినిమాలు వద్దు ?

మహేష్ బాబు వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఏం పట్టుకున్నా నిజంగానే బంగారం అయిపోతుంది. నిజానికి ‘సర్కారు వారి పాట’ చిత్రానికి మొదటి రోజు వచ్చిన టాక్ కు వీకెండ్ వరకు సినిమా నిలబడుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీజనల్ సినిమాలతో వరుసగా 3 సార్లు రూ.100 కోట్ల షేర్ మూవీస్ ను అందుకున్న హీరోగా మహేష్ రికార్డు సృష్టించాడు. అయితే అభిమానులు మాత్రం సంతృప్తి చెందడం లేదు. మరీ ముఖ్యంగా ఓ విషయంలో మహేష్ కు స్పెషల్ రిక్వెస్ట్ లు పెట్టుకుంటున్నారు.

అదేంటి అంటే, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి, ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ కానీ స్టార్ డైరెక్టర్లు కారు. మహేష్ ఇలాంటి దర్శకులతో పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మహేష్ ఇప్పుడు తన 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. మహేష్ విదేశాల నుండి రాగానే త్రివిక్రమ్ ఫైనల్ నెరేషన్ ఇస్తారు. తర్వాత ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది అని కథనాలు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయాల్సిన మహేష్ విదేశాల నుండి రాగానే వంశీ స్క్రిప్ట్ ను పక్కకి పెట్టాడు. పరశురామ్ తో సినిమా పట్టాలెక్కించాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అని మహేష్ అభిమానులు భయపడుతున్నారు. మళ్లీ మిడ్ రేంజ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా రాజమౌళి తో సినిమా చేయాలని వారు కోరుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు