Tollywood : ఫారిన్ లోకేషన్లకు పడిపోయే రోజులు పోయాయి.. కంటెంట్ ముఖ్యమంటున్న ప్రేక్షకులు

Tollywood : టాలీవుడ్ లో ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు, ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అవుతున్న విషయం తెలిసిందే. కథ కి అవసరం లేకపోయినా కొంతమంది మంచి మంచి లొకేషన్లలో షూట్ చేసి అనవసరమైన ఖర్చుతో సినిమాని పెద్దగా నిర్మిస్తూ నిర్మాతలు చేతులు కాల్చుకుంటున్నారు. కానీ గడచిన కొంత కాలంగా చూస్తుంటే నేడు సినీ ప్రేక్షకుల ఆలోచనా విధానం ఇప్పుడు మొత్తం మారిపోయింది. బడ్జెట్, నటీనటులతో ఎలాంటి సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు, అది నచ్చితే చాలు ఎగబడి చూసేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళం సినిమాలు ప్రత్యక్ష ఉదాహరణ. ఇవే గాక తెలుగులో లాస్ట్ ఇయర్ వచ్చిన బలగం, పొలిమేర 2 వంటి చిన్న సినిమాలతో భారీ హిట్లు కొట్టారు మేకర్స్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బడా సినిమాల్లోని కంటెంట్ నచ్చకపోతే మొహమాటం లేకుండా డిజాస్టర్లుగా మార్చేస్తున్నారు ప్రేక్షకులు.

ప్రమోషన్ కాదు కంటెంట్ కావాలి..

ఇక ఈ మధ్య కొన్ని సినిమాలకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసి బడ్జెట్ ని భారీగా పెంచేశారు. తీరా ఆ సినిమాలు డిజాస్టర్ అయ్యాక చేసిన ప్రమోషన్ ఖర్చుల లెక్కలు కూడా తలుచుకుని బాధ పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి ప్రమోషన్స్ ఎంత బాగా చేసినా సినిమాలో మ్యాటర్ ఉంటే చాలు దూసుకుపోవడం పక్కా అంటున్నారు నెటిజన్లు. పైగా ప్రమోషన్లలో బోయపాటి లాంటి దర్శకులు అయితే మా సినిమాలోని కొన్ని సీన్లను ఫలానా ప్రదేశంలో షూట్ చేశామని, విదేశాలకు వెళ్లామని రిలీజ్ కు ముందు ఆయా చిత్రాల మేకర్స్ చెప్పేవారు. ఇంత బడ్జెట్ అయిందని కూడా వివరించేవారు. ఈ మధ్య ఆ విషయంపై స్టేట్మెంట్స్ ఎక్కడ వినపడకపోయినా, మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ (Tollywood) మేకర్స్ అదే వే లోకి వెళ్తున్నారు. రీసెంట్ గా ఓ సినిమా మేకర్స్.. ఒక సీన్ కోసం రూ.కోట్లు ఖర్చు చేశామని, చిత్రీకరణకు 30 రోజులు పట్టిందని చెప్పారు. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ ప్లేస్ లో సాంగ్ ను షూట్ చేశామని కూడా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.

ఫారిన్ లొకేషన్లకు పడిపోయే రోజులు పోయాయి..

ఇక పలువురు దర్శకులు పలానా సీన్ ను ఫారిన్ లొకేషన్‌ లో షూట్ చేశామని మేకర్స్ ప్రకటించగానే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసే రోజులు పోయాయని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. డిజిటల్ యుగం సినీ ప్రియులకు ప్రపంచాన్ని మరింత దగ్గర చేసిందని, కంటెంట్ మాత్రమే చూస్తున్నారని చెబుతున్నారు. ఎంత మంచి లొకేషన్స్ లో మూవీ షూట్ చేసినా, కంటెంట్ బాగోలేకపోతే అవన్నీ తేలిపోతాయని అంటున్నారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ఎవరూ మూవీలోని లొకేషన్స్ కోసం ఎక్సైట్ అవ్వడం లేదని అంటున్నారు. ఎందుకంటే ఓటీటీల్లోని వివిధ మూవీల్లో అదిరిపోయే లొకేషన్స్ చూస్తున్నారని చెబుతున్నారు. నిర్మాతలు ఫారిన్ లో సీన్లకు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, ఆ మూవీ కంటెంట్ బాగా లేకపోతే ఫ్లాప్ అవ్వడం పక్కా. కాబట్టి ఇక అలాంటి ప్రమోషన్లు వద్దని, కంటెంట్ బాగుంటే చాలు అని అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ప్రేమలు, తెలుగులో బలగం వంటి లౌ బడ్జెట్ చిత్రాలు ఇందుకు ప్రత్యేక ఉదాహరణ. ఇక కంటెంట్ బాగాలేకపోతే ఎన్ని ప్రమోషన్లు చేసినా పట్టించుకోరని రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో రుజువయింది. కనుక దర్శక నిర్మాతలు ఇకనైనా మేలుకుని మూవీ బడ్జెట్ పై, హంగు ఆర్భాటాలకు కాకుండా, కంటెంట్ పై ద్రుష్టి పెడితే మంచిదని మూవీ లవర్స్ భావిస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు