Daya: మొగలిరేకులు దయా మృతి… షాక్ లో ఇండస్ట్రీ..

ఏసిని పరిశ్రమలోనైనా సినిమా సెలబ్రిటీలకు మించి సీరియల్ లో నటించే సెలబ్రిటీలకే చాలామంది అభిమానులు ఉంటాయి. ముఖ్యంగా సినిమా అయితే మూడు గంటలు మాత్రమే ఉంటుంది కానీ సీరియల్ అయితే దాదాపుగా కొన్నేళ్లపాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.. అందుచేతనే సినిమాలలో కంటే సీరియల్స్ లో నటించే వారికి భారీ క్రేజ్ ఏర్పడుతోంది.. అలా బుల్లితెర పైన కూడా బాగా క్రేజ్ సంపాదించుకున్న వారు ఉన్నారు.. తెలుగు బుల్లితెరపై చరిత్రలో సంచలనాలు సృష్టించిన సీరియల్స్ అంటే కచ్చితంగా చక్రవాకం , మొగలిరేకులు సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి..

ఈ రెండు సీరియల్స్ బుల్లితెరపై కొన్నేళ్లపాటు కొనసాగాయి. ఈ సీరియల్స్ లో నటించిన ప్రతిపాత్రకు కూడా ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు.. ముఖ్యంగా స్రవంత్రి, దయా ,ఇక్బాల్, ఇంద్ర ఇతరత్ర పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.. ఇప్పటికి వారంతా ఒక కుటుంబం లాగే కలిసిమెలిసి ఉంటారు . ఈ క్రమంలోనే ఒక చేదు వార్త వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే చక్రవాకం , మొగలిరేకులు సీరియల్స్ లో ఇంద్ర తమ్ముడిగా.. దయా పాత్రలో నటించి మెప్పించిన నటుడు మరణించినట్టుగా తెలుస్తోంది..

ఎమోషనల్ పోస్ట్ చేసిన ఇంద్రనీల్ భార్య మేఘన..
చక్రవాకం , మొగలిరేకులు సీరియల్స్ లో ఇంద్రనీల్ తమ్ముడు పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న దయ అలియాస్ పవిత్ర నాథ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. “పవి..ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నము..జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేము ఈ వార్త విన్న తర్వాత ఇది నిజం కాకూడదని కోరుకున్నాము.. ఒకవేళ ఇది అబద్దం అయితే బాగుంటుందని ఆశపడ్డాను.. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ.. మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి.. నువ్వు లేని ఆ లోటు ఎవరూ తీర్చలేరు అంటూ తెలుపుతూ ఇంద్రనీల్ భార్య మేఘన ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది..

 

View this post on Instagram

 

A post shared by Meghna Raami (@raamimeghna)

- Advertisement -

సెలబ్రిటీల స్పందన ఏమిటంటే..
అయితే ఈ పోస్ట్పై పలువురు నెటిజన్స్, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున స్పందిస్తూ అసలు దయా చనిపోవడం ఏంటి.. ?ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎందుకు ఎవరికి చెప్పలేదంటూ? పలు రకాల అనుమానాలను వ్యక్తం చేసేలా ప్రశ్నలు వేస్తున్నారు.. అంతేకాకుండా పవిత్ర నాథ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరుకుంటున్నారు..

పవిత్రనాథ్ పై భార్య ఆరోపణలు..
గతంలో పవిత్రనాథ్ పైన అతడి భార్య పలు రకాల సంచలన ఆరోపణలు చేసింది.. ముఖ్యంగా అతడికి అమ్మాయిలు అంటే పిచ్చి ఉందని తన ముందే తన ఇంటికి పిలిపించుకునే వారని.. ఇలాంటి విషయాలను ప్రశ్నిస్తే తనను కొట్టేవాడు అంటూ కూడా పలు రకాల ఆరోపణలు చేసింది.. అయితే ఈ విషయం అప్పట్లో తెగ వైరల్ గా మారింది. దీనిపై పవిత్ర నాథ్ మాత్రం స్పందించే ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఒకేసారి మరణించాడు అంటూ ఇంద్రనీల్ భార్య మేఘన చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు