Rashmi Gautam: పెళ్లి పీటలెక్కనున్న రష్మీ.. వరుడు ఎవరంటే.?

Rashmi Gautam.. ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు బుల్లితెర షో లు , మరొకవైపు సినిమాలు అంటూ భారీగా క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఎక్కువగా బుల్లితెర ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షో తోనే భారీగా పాపులారిటీ దక్కించుకుంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కూడా బోల్డ్ కంటెంట్ తో విపరీతంగా ఆకట్టుకుంది. అలా హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి కానీ తనదైన శైలిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోతాయి.. ఇప్పుడు బుల్లితెరపై పలు షో లు చేస్తూ తన అంద చందాలతో హొయలు పోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో రష్మీ గౌతమ్ కి మంచి పేరు ఉందని చెప్పవచ్చు.

Rashmi Gautam:Rashmi who is going to get married... Who is the groom?
Rashmi Gautam:Rashmi who is going to get married… Who is the groom?

పెళ్లి పీటలెక్కనున్న రష్మీ గౌతమ్..

ఇదిలా ఉండగా రష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక వార్త ఎప్పటినుంచో వైరల్ అవుతూనే ఉంది.. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ వార్తలు వైరల్ గా వినిపిస్తున్నాయి.. ఒడిస్సాకు చెందిన ఒక యువ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి ఈ మేరకు ఒక ప్రకటన కూడా రానుంది అని సమాచారం.. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టింది.. ఇప్పుడు మళ్లీ ఈమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకోబోతుందంటూ సమాచారం.. ఈ క్రమంలోనే ఈమె కాస్త ఫిట్నెస్ పైన శ్రద్ధ చూపగా.. ఇప్పటికే సన్నగా ఉండే ఈ బ్యూటీ మరింత బక్క చిక్కిపోయింది …ఇందుకు సంబంధించిన తాజా ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక దీనిపై నిజానిజాల గురించి రష్మీ స్పందించక తప్పదు..

గుంటూరు కారం సినిమాలో అవకాశం..

ఇక అందులో భాగంగానే గుంటూరు కారం సినిమాలో అవకాశం వచ్చిందని.. పూర్ణ చేసిన పాత్రకు రష్మీ ని అడిగారని.. ఆమె స్వయంగా ఈ పాత్రను వదులుకుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి.. కానీ దీనిపై రష్మీ స్పందించింది …తనను ఎవరు అడగలేదని.. అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టి పారేసింది.

- Advertisement -

రష్మీ గౌతమ్ సినిమాలు..

గుంటూరు టాకీస్ సినిమాతో మంచి పేరు దక్కించుకున్న ఈమె గత రెండేళ్ల క్రితం నందు హీరోగా వచ్చిన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. విజయీభవ ఆర్ట్స్ పతాకం పై రాజు విరాట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే పేరు కూడా పెట్టారు.. కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల నిర్మించారు. ఇందులో నందు తో పాటు రష్మీ కూడా ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. నవంబర్ 4 2022న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. దీంతో మళ్లీ సినిమాల వైపు చూడలేదు రష్మీ… ప్రస్తుతం బుల్లితెర పైనే ఎక్స్ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ముందుకు పోతోంది. మొత్తానికి రష్మీ వెండితెరకు గుడ్ బై చెప్పేసి బుల్లితెర పైన సెటిల్ అయిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు