BiggBoss 8: సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే.. ఇక దబిడి దిబిడే..!

BiggBoss8: బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్.. ప్రేక్షకులను ఎంతలా ఎంటర్టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అవకాశాలు అందుకుంటూ అటు కెరియర్ పరంగా కూడా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగా.. త్వరలోనే ఎనిమిదవ సీజన్ కి కూడా సన్నహాలు సిద్ధం చేస్తున్నారు.. అయితే ఈసారి ఎలాగైనా సరే ఈ సీజన్ ని కూడా భారీ సక్సెస్ చేయాలనే దిశగా అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సీజన్ లో కంటెస్టెంట్లుగా మళ్ళీ వీరే పాల్గొనబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

BiggBoss8:These are the season 8 contestants.
BiggBoss8:These are the season 8 contestants.

సీజన్ 7 కంటెస్టెంట్లే సీజన్ 8 లో కూడా..

ఈ సీజన్లో బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లు మళ్ళీ పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో ఎక్కువగా కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయానికి వస్తే.. శివాజీ, అమరదీప్, పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురి పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. వీరి ముగ్గురి మధ్య పోటాపోటీ ఎంతలా ఉండేదో సీజన్ 7 చూసినవారికి అర్థం అవుతుంది.. ఇక వీరు ముగ్గురే టాప్ 3లో నిలిచారు.. ఇక ఇప్పుడు వీరు ముగ్గురే బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 7 లో వీరు ముగ్గురు ఏ రేంజ్ లో షో ను సక్సెస్ చేసారో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ వీరు ముగ్గురే సీజన్ 8లో కూడా పాల్గొంటే ఇక షో దబిడి దిబిడే అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు..

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్..

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి పాల్గొని తమ సత్తా చాటారు. ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఏడుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అందరి మధ్య పోటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఎటువంటి ట్రోల్స్ కి చోటు ఇవ్వకుండా షో ని రసవత్తరంగా ముందుకు సాగించారు.. ముఖ్యంగా ఉల్టా ఫుల్టా అంటూ మొదలుపెట్టిన ఈ షో నిజంగానే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని భారీ సక్సెస్ రేట్ ను అందించింది.. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరీలో రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచి ట్రోఫీతో పాటు రూ.35 లక్షల ప్రైజ్ మనీ , జోయాలుకాస్ అందించిన డైమండ్ నెక్లెస్ అలాగే మారుతి సుజుకి కారు కూడా సొంతం చేసుకున్నారు.. ఇక ఈయన విజయానికి కారణం శివాజీ అని.. శివాజీ వెనకుండి నడిపించడం వల్లే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి . ఇక టైటిల్ కోసం పోటీపడిన అమర్దీప్ రన్నర్ గా నిలిచారు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురిని సీజన్ 8లోకి తీసుకోబోతున్నారని.. హోస్ట్ గా మళ్లీ నాగార్జున రాబోతున్నారని సమాచారం. సీజన్8 ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు