Sai Dharam Tej : పవన్ కోసం రంగంలోకి దిగుతున్న తేజ్… క్యాంపెయిన్ షెడ్యూల్ ఇదే

Sai Dharam Tej : మరో వారం పది రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో పవన్ గెలుపు కోసం జనసేన తరపున క్యాంపెయిన్ చెయ్యడానికి మెగా కాంపౌండ్ మొత్తం రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే పలువురు మెగా హీరోలు, సినీ ఆర్టిస్టులు జనసేనాని తరపున అక్కడ ప్రచారం చేయగా, తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.

సాయి తేజ్ క్యాంపెయిన్ షెడ్యూల్..

సాయి తేజ్ పాల్గొంటున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది, అతను పిఠాపురం, మచిలీపట్నం, కాకినాడలో పర్యటించబోతున్నాడు. మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభేని బాలశౌరికి సాయి తేజ్ మద్దతు కూడగట్టనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం మొదలు పెట్టిన సాయి తేజ క్యాంపెయిన్ షెడ్యూల్ తాజాగా బయటకు వచ్చింది. మే 4న మచిలీపట్నం, మే 5న పిఠాపురం, మే 6న కాకినాడలో ఆయన ప్రచార షెడ్యూల్‌లో పాల్గొంటారు.

మెగా హీరోల ప్రచారం ఎఫెక్ట్…

సాయి ధరమ్ తేజ్ లాంటి మెగా హీరోల ప్రమేయం ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వారి ఉనికి ఓటర్లలో, ముఖ్యంగా యువత దృష్టిని ఆకర్షించి, వారిలో ఉత్సాహాన్ని కలిగించే అవకాశం ఉంది. ప్రముఖుల ప్రచారాలు జనసేన సందేశాన్ని విస్తృతం చేయడంలో సహాయపడతాయి. ఎన్నికలకు ముందు కీలకమైన చివరి రోజుల్లో ఇంకా తమ ఓటు గురించి నిర్ణయం తీసుకోని ఓటర్లను ప్రభావితం చేయగలవు. ఇదిలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయగా, కాకినాడలో జనసేన లోక్‌సభ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌కు మద్దతుగా నిలిచారు.

- Advertisement -

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటుపై మాత్రమే దృష్టి సారించడంతో, జనసేన భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమనే ఆశాభావంతో ఉంది జనసేన పార్టీ. అయితే పవన్ కు అపొజిట్ గా అక్కడ అధికార వైసీపీకి చెందిన వంగ గీతా విశ్వనాథ్ నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో పిఠాపురం పోరు హీటెక్కింది. తన కుటుంబంలోని స్టార్స్ పవర్‌ను పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం అనేది తన పార్టీ పరిధిని, ప్రభావాన్ని పెంచుకోవడానికి పవన్ చేస్తున్న గట్టి ప్రయత్నం ఆయనను గెలుపు వైపు నడిపిస్తుందా? అనేది చూడాలి.

జూన్ 4 న ఫలితాలు..

ప్రచారం జోరుగా సాగుతుండగా, పోలింగ్ రోజైన మే 13న ఫలితం తేలనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో, ఈ సారి గెలుస్తామనే ధీమాగా ఉంది జనసేన.

పవన్ కోసం ప్రచారం చేసిన సినీ సెలబ్రిటీలు

జబర్దస్త్ ఆర్టిస్టులు, గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యులు, పలువురు సినీ నటీనటులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, తాజాగా సాయి ధరమ్ తేజ్ చేరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు