Double Ismart: షూటింగ్ షురూ.. ఇన్నాళ్ళ బ్రేక్ కి కారణం అదే..!

Double Ismart: విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా చిత్రం లైగర్ ను తెరకెక్కించి.. ఘోరమైన పరాభవాన్ని చవిచూసిన పూరీ జగన్నాథ్ ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.. అంతేకాదు ఆర్థికంగా చితికిపోయారు.. వీరి సినిమా కొన్న బయర్లు కూడా పూర్తిస్థాయిలో నష్టపోయారు. ఇక ఎన్నో విమర్శలు, వాగ్వాదాల తర్వాత పూరీ జగన్నాథ్ మళ్లీ తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి రామ్ పోతినేనితో ప్రాజెక్టు ప్రకటించారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్.. అయితే ఎప్పుడో గత నాలుగు నెలల క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటికీ ఒక అప్డేట్ కూడా వెలువడలేదు.. అసలు సినిమా ఉందా అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు అభిమానులు..

Double Ismart: Shooting has started.. That's the reason for the break..!
Double Ismart: Shooting has started.. That’s the reason for the break..!

షూటింగ్ షురూ..

తాజాగా మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు స్పష్టం చేశారు చిత్ర బృందం.. ఈరోజు నుంచి ముంబైలో తదుపరి షెడ్యూలు షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది..

షూటింగ్ బ్రేక్ కి కారణాలు ఇవే..

అయితే ఇన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడడానికి గల కారణాన్ని కూడా తాజాగా చిత్ర బృందం వెల్లడించింది.. రెమ్యూనరేషన్ విషయంలో రామ్ పోతినేని కాస్త డిమాండ్ చేయడంతో షూటింగ్లో జాప్యం ఏర్పడిందని నివేదికలు స్పష్టం చేశాయి.. అలాగే ఆర్థిక సవాళ్లు, హిందీ మార్కెట్ మందగించడం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు స్పష్టం చేశారు.. ఇక ఎట్టకేలకు నిర్మాణ బృందం ఈ సమస్యలను పరిష్కరించి ఇప్పుడు తిరిగి షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సరికొత్త చిత్రానికి చార్మీ, పూరీ జగన్నాథ్ పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. అంతేకాదు ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేనినీ మాస్ హీరోగా మార్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆయనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు పూరీ జగన్నాథ్.. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..

- Advertisement -

పూరీ జగన్నాథ్ కెరియర్..

ఇక పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే.. ఒకప్పుడు బద్రి, ఇడియట్, పోకిరి వంటి చిత్రాలతో భారీ బాక్సాఫీస్ విజయాలను సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ ఆ తర్వాత సక్సెస్ కోసం ఎదురుచూడడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఎంతోమంది హీరోలకు స్టార్ స్టేటస్ ను అందించిన ఈయనతో ఇప్పుడు సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ఇక లైగర్ ఎఫెక్ట్తో యంగ్ హీరోలు కూడా అవకాశం ఇవ్వడం లేదు.. మరి ఈసారి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో తన పాత వైభవాన్ని మళ్లీ తెచ్చుకుంటారో లేదో చూడాలి.. మొత్తానికైతే రామ్ పోతినేనితో సినిమా పూరీ జగన్నాథ్ కు కలిసి రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.. మరి ఏ మేరకు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు