Raviteja : ‘ఈగల్’ ఒటిటి హక్కులు ఈ సంస్థ చేతికే !

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “ఈగల్” సినిమా రెండు వారాల కింద ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ వరకూ పరవాలేదనిపించినా, ఆ తర్వాత ప్రేక్షకులని థియేటర్ల వద్దకు రప్పించలేకపోయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మించింది. అయితే సంక్రాంతికి రావాల్సిన ఈగల్ గ్యాప్ ఎక్కువ రావడం వల్ల పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా, వీకెండ్ వరకూ ఒకే అనిపించి వర్కింగ్ డే లోకి ఎంటర్ అయ్యాక డల్ అయిపోయింది.

ఈగల్ సినిమాపై అంతగా బజ్ లేదని తెలుసు కాబట్టే మేకర్స్ చాలా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు. అయినా కూడా ఈగల్ లాస్ ని ఆపలేకపోయారు. 21 కోట్ల బిజినెస్ చేసిన ఈగల్ 16 కోట్ల వరకూ వసూలు చేసి ఆల్మోస్ట్ థియేటర్ రన్ ని పూర్తి చేసుకోబోతుంది. అయితే మేకర్స్ మాత్రం తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయిందని పోస్టర్లు వేశారు. ఇక ఈ వారం సినిమాలు కూడా రిలీజ్ కావడంతో ఈగల్ ని థియేటర్లలో ఆల్మోస్ట్ తీసేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా రవితేజ కి హ్యాట్రిక్ ప్లాప్స్ మళ్ళీ పడ్డాయని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా ఈగల్ మూవీ డిజిటల్ ఓటిటి బిజినెస్ కూడా జరిగిపోయింది. ప్రముఖ తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన ఈటివి విన్ ఈగల్ డిజిటల్ హక్కులని కొనుక్కోవడం జరిగింది. అయితే ఈ బిజినెస్ డీల్ ఎన్ని కోట్లకి జరిగింది అన్న విషయంపై సమాచారం రావాల్సి ఉంది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈగల్ సినిమా థియేటర్లలో ఉండగానే, రిలీజ్ అయి నెల కాకముందే డిజిటల్ లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. బహుశా మార్చి 7 లేదా 8న ఈగల్ ఓటిటి లో ప్రసారమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉండగా, థియేటర్ లాస్ ని కొంచెమైనా కవర్ చేసుకునేందుకు డిజిటల్ రైట్స్ డీల్ ని తొందరగా ఫినిష్ చేసారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు