Tollywood: రజిని కాంత్ ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ శత జయంతి వేడుక

నందమూరి తారక రామారావు. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. మొదటి తరం హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమ ని తన నటనతో మూడు దశాబ్దాలు ఏలిన నటుడాయన. అంతే కాదు తెలుగు దేశం పార్టీ స్థాపించి ఉమ్మడి రాష్ట్రాల ముఖ్య మంత్రిగా ఎన్నో సేవలనందించి రాజకీయ నాయకుడిగా ను సక్సెస్ అయ్యారు. 1923 నిమ్మకూరు లో జన్మించిన ఆయన సినిమాలపై ఆసక్తి తో చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి 1949 లో మనదేశం నటుడిగా పరిచయమై పాతాళ భైరవి తో హీరోగా నిలబడ్డారు. ఆ తర్వాత పౌరాణిక, భక్తిరస సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. ఇక భారత ప్రభుత్వం ఆయన కి 1968 లో పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది. ఆ తర్వాత 1982 లో తెలుగు దేశం పార్టీ ని స్థాపించి కేవలం 9 నెలల కలం లోనే సీఎం అయ్యి రాజకీయ నాయకుడిగా కూడా మెప్పించాడు.

తాజాగా 2023 మే 28 తో ఎన్టీ రామారావు జన్మించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా ఏప్రిల్ 28 న టాలీవుడ్ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు కలిసి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా సూపర్ స్టార్ రజిని కాంత్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. అంతే కాకుండా నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరవ్వడమే కాకుండా అన్ని తానై ప్రోగ్రాం ని నిర్వహించనున్నాడు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో అతిథిగా భాగం పంచుకంటున్నారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమం ఏప్రిల్ 28 న విజయవాడ లోని పోరంకి దగ్గర అనుమోలు గార్డెన్స్ లో జరుగనుంది. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాత గా వ్యవహరించనున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు