PushpaTheRule : భారీ లాభాలపై కన్నేసిన పుష్ప మేకర్స్..

టాలీవుడ్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప ది రూల్’ కూడా ఒకటి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోనూ విపరీతమైన అంచనాలున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సౌత్ నుండి సడన్ గా రిలీజ్ అయినా ఎగబడి చూసేస్తారు అనే రేంజ్ లో హైప్ తెచ్చుకుంది పుష్ప పార్ట్ 2. ఇక పుష్ప ది రూల్ ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఆల్రెడీ సెట్స్ లో అల్లు అర్జున్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే పుష్ప ది రూల్ సినిమా ఆగష్టు 15న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. అయితే పుష్ప మూవీ మేకర్స్ నుండి తాజాగా ఒక సమాచారం వచ్చింది.

నార్త్ లో కూడా ఓన్ రిలీజ్ కి ప్లాన్..

పుష్ప ఫస్ట్ పార్ట్ నార్త్ లో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి వంద కోట్ల వసూళ్ళని అందుకుంది. ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాపై నార్త్ లో ఉన్న క్రేజ్ ని కూడా పూర్తిగా క్యాష్ చేసుకోవాలని మైత్రి నిర్మాతలు ఆలోచనలో ఉన్నట్టు తాజా సమాచారం. అవును.. అదేంటంటే పుష్ప ది రూల్ ని నార్త్ లో కూడా మైత్రి మూవీ మేకర్స్ ఓన్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక అక్కడ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సొంతంగా విడుదల అవుతుందని సమాచారం. కానీ డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఖరారు కాలేదని సమాచారం. అయితే AA ఫిల్మ్స్ ,మరియు సినీస్తాన్ AA డిస్ట్రిబ్యూటర్స్ వరుసగా నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ ఏరియా లను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ డీల్ చాలా కాలం క్రితం ముగిసింది. కానీ అన్ని ఏరియాల్లో లాభాల్లో వాటా తీసుకుంటూ హిందీ నార్త్ వెర్షన్ రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయంపై మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ రావాల్సింది.

- Advertisement -

నార్త్ లో పెరిగిన హైప్ వల్లే..

అయితే పుష్ప ది రూల్ ని నార్త్ లో కూడా తామే రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకోవడానికి కారణం ఈ సినిమా పై ఉన్న క్రేజే అని తెలుస్తుంది. పుష్ప పార్ట్ వన్ రిలీజ్ అయినపుడు 10 కోట్ల బిజినెస్ కూడా చేయలేదు. కానీ అనూహ్యంగా అక్కడ భారీ కలెక్షన్లు సాధించి 110 కోట్ల కి పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఇప్పుడు నార్త్ లో 500 కోట్ల వసూళ్లు సాధించే రేంజ్ లో ఈ సినిమా కి హైప్ వచ్చింది. దీనికి తోడూ పుష్ప ది రూల్ గ్లిమ్ప్స్ హిందీ వెర్షన్ కి వచ్చిన రెస్పాన్స్ చూసే ఉంటారు. అందుకే మైత్రి దృష్టిలో నార్త్ పై అంత ఫోకస్ ఉంది. ఓవరాల్ గా పుష్ప ది రూల్ పై మేకర్స్ 1000 కొట్ల మార్క్ లక్ష్యంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే రోజు స్పెషల్ టీజర్ వదిలి ఆ రోజు నుండే ప్రమోషన్స్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నారని సమాచారం.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు