Mythri Movie Makers: చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు “మైత్రి”

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకరు. ఈ సంస్థ నిర్మించిన సినిమాలు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలను కేవలం నిర్మించడమే కాకుండా ఈ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ సంస్థను కూడా స్టార్ట్ చేసి సొంతంగా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేయటం మొదలుపెట్టాయి. ఇప్పటివరకు ఈ సంస్థ ఒకటి రెండు చిన్న సినిమాలు మినహా నిర్మించిన సినిమాలన్నీ కూడా లార్జ్ స్కేల్ సినిమాలు. ఈ సంస్థలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సంస్థలో కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి వాటి అన్నిటికి ఇప్పుడు సీక్వెల్స్ రెడీ చేసుకుంటూ పోతుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.

మైత్రి మూవీ మేకర్స్ కి శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రొడక్షన్ హౌస్ కి స్టార్ హీరోస్ తో సూపర్ హిట్ సినిమాలు చేసిన క్రెడిట్ ఉంది. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఈ ప్రొడక్షన్ హౌస్ సినిమాలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకి మంచి పేరుని తీసుకొచ్చింది మాత్రం “రంగస్థలం” సినిమా. అప్పటినుంచి దర్శకుడు సుకుమార్ తో వీరికొక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకనే దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ లోనే కొనసాగుతు సినిమాలు చేస్తున్నాడు.

కేవలం సుకుమార్ మాత్రమే కాకుండా సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమాను ఇదే బ్యానర్ లో దర్శకుడుగా తెరకెక్కించాడు. ఇకపోతే ఈ బ్యానర్ ఇప్పుడు సీక్వెల్స్ ను రెడీ చేసే పనిలో పడింది. ఈ బ్యానర్ లో రాబోతున్న ఫస్ట్ సీక్వెల్ సినిమా పుష్ప-2. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తెలుగు సినిమా యొక్క సత్తాను ప్రపంచం మొత్తం చాటింది పుష్పా సినిమా. ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప -2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

- Advertisement -

ఈ ప్రొడక్షన్స్ లో చిన్న సినిమాగా వచ్చి మంచి సంచలనం సృష్టించిన సినిమా “మత్తు వదలరా” ఈ సినిమా కేవలం స్టోరీ పరంగానే కాకుండా, టెక్నికల్ గా కూడా కొత్తగా, బ్రిలియంట్ గా అనిపించింది. ఒక దర్శకుడుగా రితీష్ రానా ను నిలబెట్టింది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా మత్తు vadalara-2 సినిమాను తీస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేసింది ఈ సంస్థ.

ఈ సంస్థలో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా చిత్రాలహరి. సాయిధరమ్ తేజ్ కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ లో చిత్రాలహరి సినిమా ఒకటి. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా చాలామందికి హార్ట్ టచింగ్ అనిపించి బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి అదే బ్యానర్ లో సీక్వెల్ రెడీ కాబోతుంది. ముందుగానే ఆకట్టుకున్న ఈ సినిమాలన్నీ సీక్వెల్ తో ఎంతవరకు ఆకట్టుకుంటాయో తెలియాలి అంటే కొంతవరకు వేచి చూడాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు