Hari Hara Veeramallu : సెట్స్ లో క్రిష్ ఇంత సీన్ క్రియేట్ చేశాడా? అందుకే డైరెక్టర్ ఛేంజ్

Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు టీజర్ తాజాగా రిలీజ్ అయ్యి సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ యాక్షన్, హీరోయిజం ఎలివేషన్ వంటి సన్నివేశాలతో టీజర్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. మొఘలుల కాలం నాటి కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ డైరెక్టర్ విషయంలో మాత్రం డైలమా నెలకొంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఈ మూవీకి ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఇలా డైరెక్టర్ ఛేంజ్ అవ్వడానికి సెట్స్ లో డైరెక్టర్ క్రిష్ సీన్ క్రియేట్ చేయడమే కారణం అనే టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ ఈ మూవీ విషయంలో డైరెక్టర్ ఏం చేశారు? అనే వివరాల్లోకి వెళితే…

క్రిష్ తో విడిగిపోయారా?

హరిహర వీరమల్లు మూవీని 2019లోనే అనౌన్స్ చేయగా, 2020లో షూటింగ్ మొదలైంది. దాదాపు నాలుగేళ్ల నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ హరిహర వీరమల్లు మాత్రం ఇంకా థియేటర్లోకి రాలేదు. హిస్టారికల్ మూవీ అటకెక్కింది అంటూ ప్రచారం కూడా జరిగింది. ఓవైపు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తప్ప ఇతర సినిమాలను పూర్తి చేయడం, రాజకీయాలతో బిజీగా ఉండడం, మరోవైపు క్రిష్ అనుష్కతో కొత్త మూవీని అనౌన్స్ చేయడంతో హరిహర వీరమల్లు మూవీ ఆగిపోయింది అనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ విషయంలో డైరెక్టర్ క్రిష్ చాలా టైం వేస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

అలాగే సినిమాలో అనవసరమైన షాట్స్ కూడా ఎక్కువయ్యాయని, ఫలితంగా బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోయిందని సమాచారం. అంతేకాకుండా క్రిష్ కు రెండో పార్ట్ అనే ఆలోచన లేదని, ఆయన ప్లానింగ్ వల్ల 50% స్టోరీకే క్లియర్ గా ఎడిట్ చేశాక కూడా 3 గంటల కంటే ఎక్కువ రన్ టైం వచ్చే అవుట్ పుట్ వచ్చిందని సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నిరోజులు డేట్స్ కేటాయించాలనీ, మరోవైపు ప్రొడ్యూసర్ రత్నంకు ఇంకా ఎంత బడ్జెట్ పెట్టాలి అనే అసహనం పెరిగిపోవడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.

- Advertisement -

అందుకే క్రిష్ ను పక్కన పెట్టేశారా?

దీంతో హీరో, నిర్మాతలిద్దరూ క్రిష్ ఈ ప్రాజెక్ట్ ను చేయడానికి ఇష్టపడలేదని, ఇప్పటిదాకా క్రిష్ డైరెక్ట్ చేసిన పార్ట్ నే పార్ట్ 1గా రిలీజ్ చెయ్యాలని అనుకున్నారట మేకర్స్. పార్ట్ 2ను ప్రొడ్యూసర్ రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో చేయించాలని 6 నెలల కిందటే డిసైడ్ అయ్యారనీ సమాచారం. అందుకే క్రిష్ ఈ వీరమల్లు ప్రాజెక్టును పక్కన పెట్టి అనుష్కతో సినిమా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్స్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ సినిమాలకు టైమ్ కేటాయిస్తారు. అప్పుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో కొత్త సెట్ వేసి పార్ట్ 2ను స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.

జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు….

జ్యోతి కృష్ణ స్టార్ డైరెక్టర్ కాకపోవడంతో ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ అనేసరికి మెగా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. కానీ నిజానికి జ్యోతి కృష్ణ ఇప్పటిదాకా తెలుగులో రూల్స్ రంజన్, ఆక్సిజన్, నీ మనసు నాకు తెలుసు, తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18, కేడి, ఓహ్ లా లా లా నే 6 సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమాల్లో ఒకటి కూడా హిట్ కాకపోవడమే పవన్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు