Allari Naresh : సెంటిమెంట్ కోసం ఆ టైటిల్ పెట్టలేదు.. – అల్లరి నరేష్

Allari Naresh : టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు ఫైనల్ గా మే 3న రిలీజ్ అయిపోతుంది. అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కామెడీ సినిమా కావడంతో ఈ సినిమాపై క్రేజీ అంచనాలున్నాయి. ఒకప్పుడు నరేష్ సినిమా అంటేనే హిలేరియస్ కామెడీ తో పాటు, మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్ ఇచ్చేవారు ప్రేక్షకులు. కానీ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక, తన మార్క్ కామెడీ సినిమాలు చెయ్యట్లేదు. ఫలితంగా మినిమం గ్యారెంటీ హీరో కాస్తా ఒక్క హిట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే రీసెంట్ గా ఉగ్రం సినిమాతో వచ్చినా అది సీరియస్ జోనర్ లో వచ్చిన చిత్రం కాగా, సంక్రాంతి కి నాగార్జున నా సామిరంగలో ప్రత్యేక పాత్రలో నటించి అలరించాడు. అయితే ఎన్నాళ్లనుంచొ అల్లరి నరేష్ నుండి ఒక పక్కా కామెడీ సినిమా రావాలని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకులను తన కామెడీ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లరి నరేష్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

సెంటిమెంట్ కోసం ఆ టైటిల్ పెట్టలేదు..

ఇక ఆ ఒక్కటి అడక్కు టైటిల్ ఎందుకు పెట్టారు అని అల్లరినరేష్ కి విలేఖరి ప్రశ్నించగా, దానికి అల్లరి నరేష్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. టైటిల్ ఖచ్చితంగా బరువుగా వుంటుంది. ఆ సినిమాకి, దీనికి పోలిక పెడతారేమో అని కాస్త ఒత్తిడిగా అనిపించింది. అయితే ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. రకరకాల పేర్లు అనుకున్నప్పుడు.. ఒక సందర్భంలో సడన్ గా ‘ఆ ఒక్కటీ అడక్కు’అని వచ్చింది. నిజానికి ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్. ఇందులో హీరోకి ఏజ్ బార్ అయినప్పటికీ పెళ్లి కాదు. అందరూ తనని పెళ్లి ఎప్పుడు, పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావ్ అంటే చిరాకుతో చెప్పే డైలాగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఆ విధంగా ఈ టైటిల్ ని అనుకున్నాం అని అని, నాన్నగారి సినిమా టైటిల్ అన్న సెంటిమెంట్ తో పెట్టలేదని అన్నాడు.

హోమ్ గ్రౌండ్ లో ఆడినట్లుగా ఉంది..

ఇక ఆ ఒక్కటి అడక్కు తో మళ్ళీ కామెడీ జోనర్ లో సినిమా చేసేసేసరికి తనకు హోమ్ గ్రౌండ్ లో ఆడినట్లుగా వుంది అని అన్నాడు. అలాగే కామెడీకి ఇదివరకటికంటే ఆదరణ బాగా పెరిగిందని, సామజవరగమన, డీజే టిల్లు లాంటి హ్యుమర్ వున్న సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయని, అలాగే తమ సినిమాని కూడా ఆదరిస్తారని భావిస్తున్నామని (Allari Naresh) అన్నాడు. ఇక మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి మే 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు