Mytri Movie makers: “మైత్రి”ని “రాముడు” పరీక్ష పెడితే “హనుమాన్” గట్టెక్కించాడు…

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో “హనుమాన్” సినిమా భారీ ప్రేక్షకాదరణతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా హనుమాన్ నిజాం లో అయితే అద్భుతమైన కలెక్షన్లతో 30 కోట్ల షేర్ మార్క్ దిశగా దూసుకుపోతుంది. అయితే హనుమాన్ మూవీ యొక్క నైజాం రైట్స్ ని కొనుగోలు చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాతో భారీ లాభాలను అందుకుంటున్న ఈ నిర్మాతలు అంతకు ముందు రాములవారి సినిమాకు భారీ నష్టాలను కూడా ఎదుర్కొన్నారన్న సంగతి తెలుసా..

అదేంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం తెలుగు వెర్షన్ ను ‘యువి క్రియేషన్స్’ వారు ముందు కొనుగోలు చేయగా, వారి నుండి ‘పీపుల్ మీడియా’ వారు కొనుగోలు చేశారు. అయితే ‘ఆదిపురుష్’ నైజాం హక్కులను మాత్రం వారి నుండి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో ఈ అది పురుష్ మూవీ వల్ల నైజాంలో ఫుల్ రన్లో ‘మైత్రి’ వారికి రూ.15 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ తో మైత్రి వారికి భారీ లాభాలు రావడమే కాకుండా ఆది పురుష్ వల్ల లాస్ అయినదానికీ రెట్టింపు లాభం హనుమాన్ తో వస్తుందట.

ఇప్పుడు ‘హనుమాన్’ వల్ల ‘మైత్రి’ వారి నష్టాలు తీరిపోయినట్టు తెలుస్తుంది. అయితే హనుమాన్ మూవీ నిజాం లో లాంగ్ రన్ లో మరో 5 కోట్లు అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది. హనుమాన్ నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ కేవలం 7 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 27 కోట్ల షేర్ సాధించింది. అంటే బడ్జెట్ కి 20 కోట్ల పైనే వెనకేసుకుందన్న మాట. మరి ఓవరాల్ గా హనుమాన్ నైజాం లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు