Prashanth varma : అయోధ్య స్పెషల్ గా “జై హనుమాన్” అప్డేట్…

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల చేత మెప్పు పొందుతున్న సినిమా “హనుమాన్”. పండక్కి విడుదలైన అన్ని సినిమాల్లో తక్కువ రేంజ్ ఉన్న సినిమాగా విడుదలై అన్నిటికంటే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా హనుమాన్ చిత్రం 10 రోజులు పూర్తి చేసుకోగా, ఈ పది రోజుల్లో హనుమాన్ సినిమా ఏకంగా 107 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా, 201 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి విజయవంతంగా థియేటర్లలో ఇప్పటికి ప్రదర్షింపబడుతుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక చివర్లో టైటిల్ ఎండ్ కార్డు లో హనుమాన్ సీక్వెల్ ని ప్రకటిస్తూ “జై హనుమాన్” అంటూ టైటిల్ ని కూడా రివీల్ చేస్తూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన స్పెషల్ గా ఈరోజు రాత్రికి జై హనుమాన్ సీక్వెల్ అప్డేట్ ని మేకర్స్ ప్రకటించబోతున్నారని సమాచారం అందింది. బహుశా ఆ సినిమాలో ఉండే నటీనటుల గురించి మేకర్స్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

అయితే ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే భాగంగా తెరకెక్కబోయే ఈ సినిమా లో ఓ పెద్ద హీరో నటిస్తున్నాడని సమాచారం. మరి హనుమాన్ మేకర్స్ ఎలాంటి క్రేజీ అప్డేట్ ని ప్రకటిస్తారో తెలియాలంటే ఈ రాత్రి వరకు వెయిట్ చేయాలి. ఇక ఈ అనౌన్స్ మెంట్ తో హనుమాన్ థియేటర్ రన్ కి మరింత బూస్టప్ అందించే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు