Ravi Teja: రాజమౌళి సినిమాకు సంపత్ నంది సీక్వెల్

వరుణ్ సందేశ్ హీరోగా చేసిన “ఏమైంది ఈవేళ” సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది. ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది సంపత్. అయితే ముందు సినిమా ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అని రామ్ చరణ్ తేజ్ చెప్పడంతో, ఏమైంది ఈవేళ అనే సినిమాను చేసి తర్వాత చరణ్ దగ్గరికి చేరాడు సంపత్. ఆ తర్వాత చరణ్ తో రచ్చ అనే సినిమాను చేసి మంచి హిట్టును సాధించాడు.

అయితే ఇప్పటివరకు సంపత్ నంది ఎన్ని సినిమాలు చేసినా కూడా రచ్చ సినిమా నే గుర్తుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా అంతటి ఘనవిజయాన్ని సాధించింది ఆ రోజుల్లో. రామ్ చరణ్ తేజ్ ని పర్ఫెక్ట్ గా చూపించి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేశాడు సంపత్ నంది.

ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి. వాస్తవానికి ఆ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించాలి. కానీ ఆ ప్రాజెక్టు డిలే అవుతుండడంతో సంపత్ నందిని ఎక్కువ కాలం వెయిట్ చేయించడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ వేరే సినిమా చేసుకోమని చెప్పారు. ఆ టైంలోని బెంగాల్ టైగర్ అని సినిమాను చేశాడు సంపత్ నంది. రవితేజ నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది.

- Advertisement -

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని, గోపీచంద్ తో గౌతమ్ నంద అనే సినిమాను తెరకెక్కించాడు సంపత్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ సాధించక పోయినా కూడా చాలామందికి నచ్చే సినిమాల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. మనీ గురించి ఈ సినిమాలో చెప్పిన విధానం చాలామందిని ఆకట్టుకుంది. ఈ సినిమా డైలాగులు కూడా ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ రీల్స్ లో కనిపిస్తూ ఉంటాయి.

ఆ తర్వాత లేటెస్ట్ గా చేసిన సినిమా సీటిమార్. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇకపోతే సంపత్ నంది ఒక సీక్వెల్ కి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది సాదాసీదా సీక్వెల్ కాదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్తిలి సత్తి క్యారెక్టర్ ను, విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసి ఆ సినిమాను కమర్షియల్ గా హిట్ చేసే విధానం ఇప్పటికీ మర్చిపోలేము.

అలానే విక్రమార్కుడు సినిమా చాలా లాంగ్వేజెస్ లో రీమేక్ అయిన కూడా రవితేజ పర్ఫామెన్స్ ని ఎవరు మ్యాచ్ చేయలేదు అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చారు రైటర్ విజయేంద్రప్రసాద్. ఇకపోతే రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ సీక్వెల్ కు సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లో రవితేజ మళ్ళీ నటించినున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల వరకు ఇంకో ప్రాజెక్టు పైన రాజమౌళి కూర్చోరు. అందుకే రాజమౌళి చేయాల్సిన ఈ ప్రాజెక్టును సంపత్ డీల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే రాజమౌళి విక్రమార్కుడు తెరకెక్కించిన రీతిలో ఈ సీక్వెల్ ను సంపత్ నంది తెరకెక్కిస్తాడా.? అని తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు