Samantha : ఆ వీడియో వల్లే సమంత, చైతూ విడాకులు ?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో హీరోయిన్ సౌందర్య లాంటి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత మొదటి వరుసలో ఉంటారు. సౌందర్య లాగే ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంది సమంత. అక్కినేని నాగచైతన్య తో విడాకులు అంశం తప్ప మిగతా అన్నిటిలో సమంత పర్ఫెక్ట్ హీరోయిన్. తమిళ్ ఇండస్ట్రీలో మెరిసిన హీరోయిన్ సమంత… ఆ తర్వాతే మన తెలుగులోకి వచ్చింది.

గత 14 సంవత్సరాలుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది హీరోయిన్ సమంత ( Samantha ). ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈమె హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమాతోనే ఆమె లైఫ్ కూడా మారిపోయింది. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలోనే హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది ఈ హీరోయిన్ సమంత. ఇంకేముంది ఇద్దరూ ఏకమై దాదాపు 6 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. అనంతరం రెండు కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం కూడా చేసుకున్నారు అక్కినేని నాగచైతన్య మరియు సమంత.

పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి సినిమాలు కూడా చేశారు. లైఫ్ ఎంజాయ్ చేశారు. అనునిత్యం ఒకరికొకరై కలిసి జీవించారు. ఎలాంటి గోడవలు లేకుండా ముందుకు సాగారు అక్కినేని నాగచైతన్య, సమంత. కానీ ఏమైందో తెలియదు కానీ 2017లో వివాహం చేసుకున్న ఈ జంట… 2021 డిసెంబర్లో విడాకులు తీసుకుంది. కొన్ని పర్సనల్ కారణాలు చెప్పి హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత ఎవరి దారి వారిదే అన్నట్లుగా జీవిస్తున్నారు.

- Advertisement -

2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్న హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. తెలుగులో ఓ ప్రముఖ జర్నలిస్టు వీరిద్దరి విడాకుల వెనుక భారీ రహస్యాన్ని బయటపెట్టారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ టాపింగ్ కారణమని బాంబు పేలిచారు. హీరోయిన్ సమంత ఫోన్ టాప్ చేసి… ఓ వీడియోతో ఆమెను బెదిరించారని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. ఆ సందర్భంలో సమంతను భయపెట్టి బేరసారాలు కూడా ఆడారని ఇది తెలిపారు. అయినప్పటికీ సమంత ఫోన్ టాపింగ్ చేసిన వ్యక్తుల మాటలు వినలేదట.

దీంతో వారు అక్కినేని నాగచైతన్య ఇంట్లో సమంతకు సంబంధించిన పర్సనల్ విషయాన్ని బహిర్గతం చేశారట. దాంతో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని ఆ ప్రముఖ జర్నలిస్టు చెప్పుకువచ్చారు. ఈ అంశంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై కొంత మంది మాజీ పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు రాజకీయాకుల ఫోన్లే ట్యాపింగ్ గురి అయినట్టు అందరూ అనుకున్నారు. కానీ, రిసెంట్ గా సమంత గురించి వస్తున్న వార్తలు చూస్తే రాజకీయా నాయకులతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు