రష్మిక మందన్నా.. పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్. ఈ కన్నడ భామ తెలుగు లో ఛలో మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. రష్మిక మందన్నా చేసిన సినిమాలు ప్లాప్ అయినా.. ఆమెకు మాత్రం ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషాల్లోనూ వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది.
అయితే ఈ నేషనల్ క్రష్ తాజా గా బాలీవుడ్ లో మంచి పాజిటివ్ టాక్ తో రచ్చ చేస్తున్న సినిమాను వదులుకుందట. ఇటీవల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ మూవీ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా ముందుగా రష్మిక మందన్నానే అనుకున్నారట. దీనిపై డైరెక్టర్ గౌతమ్.. రష్మిక తో చర్చలు కూడా జరిపారట. అయితే ఈ భామకు డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీని వదులుకుందట. ప్రస్తుతం ఈ మూవీలో హీరోయిన్ గా మహారాష్ట్ర నటి మృనల్ ఠాకూర్ నటించింది.
అయితే రష్మిక క్రేజీ ప్రాజెక్ట్ ను వదులుకుని తప్పు చేసిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఈ జెర్సీ మూవీ చేసి ఉంటే రష్మిక మందన్నా.. స్టార్ డమ్ మరింత పెరిగేది. కాగ రష్మిక ప్రస్తుతం.. బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నూ, రణ్ బీర్ కపూర్ తో అనిమల్, అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై చేస్తుంది. అలాగే విజయ్ దళపతితో 66 , అల్లు అర్జున్ తో పుష్ప ది రూల్ సినిమాలు చేస్తుంది.