Shaitaan OTT release date : ఓటిటిలోకి సైతాన్ రాక ఎప్పుడంటే?

Shaitaan OTT release date : ఏడాది హారర్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సైతాన్ ఓటిటి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ ఏ ఓటిటిలోకి రాబోతుంది? అనే వివరాల్లోకి వెళ్తే…

సైతాన్ గుజరాతీ మూవీ రీమేక్

అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ హారర్ మూవీ సైతాన్. వికాస్ బహ్ల్ ఈ మూవీని 2023లో రిలీజ్ అయిన గుజరాతి హారర్ మూవీ వాష్ కి రీమేక్ గా రూపొందించారు. గుజరాత్ మూవీకి రీమేక్ అయినప్పటికీ ఈ మూవీని కంప్లీట్ గా నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్ది  థియేటర్లలోకి రిలీజ్ చేశారు. ఊహించనీ విధంగా ఈ ఏడాది బాలీవుడ్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది ఈ మూవీ.

రికార్డుల మోత మోగించిన సైతాన్..

60 నుంచి 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 211 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో ఇండియన్ సినిమాగా హిస్టరీని క్రియేట్ చేసింది. సైతాన్ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో హిందీ సినిమాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నిజానికి ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరోలు అందరికీ బాక్స్ ఆఫీసు వద్ద ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కానీ సైతాన్ మాత్రం అన్నింటినీ దాటుకుని హిట్ గా నిలిచింది.

- Advertisement -

సైతాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇంతటి ఘన విజయం అందుకున్న సైతాన్ మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ గురించి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లోనే అంటే మే 3 నుంచి సైతాన్ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. కానీ ఓటిటిలో ఈ మూవీని కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తారా? లేదంటే ఇతర దక్షిణాది భాషల్లో కూడా రిలీజ్ చేస్తారా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తే థియేటర్లలో చూడడం మిస్ అయిన టాలీవుడ్ ఆడియన్స్ కంఫర్టబుల్ గా తెలుగులోనే ఓటిటిలో చూసి ఆనందిస్తారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే సైతాన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

సైతాన్ స్టోరీ ఇదే..

ఓ అపరిచితుడు ఇంట్లోకి ప్రవేశించాక అతని మాయ వల్ల పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయి? అతని నుంచి ఆ కుటుంబం ఎలా బయట పడింది? ఆ నరకాన్ని దాటుకుని ఎలా బయటకు వచ్చారు? అన్నది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీని అజయ్ దేవగన్ ఫిలిమ్స్, పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్, జియో స్టూడియోస్ సమర్పణలో జ్యోతి దేశ్ పాండే, అజయ్ దేవగన్, కుమార్ మంగత్ పాఠక్ అండ్ అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు