Ranveer Singh Prashant Varma Movie Update : ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో బ్రహ్మరాక్షసుడు… అదిరిపోయే విలన్‌గా రణవీర్

Ranveer Singh Prashant Varma Movie Update : హనుమాన్ మూవీతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాగా తెరకెక్కించి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ డైరెక్టర్. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా ఈ ఒక్క మూవీతో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయనపై ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీకి ప్లాన్ సిద్ధమైంది. తాజాగా ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని, అందులో రణవీర్ సింగ్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని ప్రచారం మొదలైంది. మరి ఇంతకీ ఈ మూవీ టైటిల్ ఏంటి? అంటే…

టైటిల్ ఇదే?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీకి బ్రహ్మ రాక్షసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని తెలుస్తోంది. అంటే మూవీ పూర్తయ్యాక ఈ మూవీ అసలు టైటిల్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో రణవీర్ సింగ్ ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అదిరిపోయే విలన్ గా చూపించబోతున్నాడు అని సమాచారం. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బ్రహ్మ రాక్షసుడు మూవీ కూడా ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ లో భాగం కావడం. కాగా వెంటనే ఈ మూవీని స్టార్ట్ చేసి 2025లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

రణవీర్ రాక్షసుడా?

ఇక ఈ నేపథ్యంలోనే అసలు రణవీర్ ను ప్రశాంత్ వర్మ ఏ విధంగా చూపించబోతున్నాడు అనే చర్చ మొదలైంది. భారతీయ పురాణ ఇతిహాస గ్రంధాలు, ఇండియన్ మైథాలజీలో సూపర్ హీరోల స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ ఈ సినిమా కథ రాసారని ఇప్పటికే రూమర్లు వైరల్ అవుతున్నాయి. దీంతో పురాణాల్లో కనిపించిన విల్లన్ లలోనే ఎవరినో ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ఆ క్యారెక్టర్ లోనే రణవీర్ సింగ్ ని చూపించబోతున్నారని అంటున్నారు. కానీ ఆ పాత్ర ఏంటి అన్నదే సస్పెన్స్.

- Advertisement -

సీక్రెట్ గా మూవీ లాంచ్..

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ను సైలెంట్ గా పూర్తి చేశారు చిత్ర బృందం. హనుమాన్ జయంతి సందర్భంగా రణవీర్ సింగ్ హైదరాబాద్ కి రాగా, ప్రశాంత్ వర్మ ఆయనతో కలిసి సినిమా పూజను పూర్తి చేశారు. అలాగే ఈ సినిమా లాంచ్ ఈవెంట్ ఫోటోలను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నింగ్, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు