NTR.. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి అభిమానులే కాకుండా చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా ఆయన మంచితనం గురించి ఎన్నోసార్లు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.. ముఖ్యంగా స్నేహానికి మంచి విలువ ఇస్తారంటూ కూడా చాలామంది తెలియజేశారు.. ఎన్టీఆర్ తన సొంత ఊరు కోసం ఎలాంటి పని చేయడానికి అయినా సరే సిద్ధంగానే ఉంటారు. ముఖ్యంగా దైవ కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. వాటి గురించి చూద్దాం.
భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి విరాళం..
![NTR: NTR's great heart.. huge donation..!](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/05/GNj0WzFacAIZUGm.jpg)
NTR: NTR’s great heart.. huge donation..!
జూనియర్ ఎన్టీఆర్ తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉండేటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి విరాళం ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ గుడికి దాదాపుగా 12 లక్షల 50 వేల రూపాయలు విరాళం ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ సమాచారం గుడి బయట దాతల పేర్లను రాళ్లపైన రాయించడంతో అసలు విషయం బయటపడింది.. ముఖ్యంగా ఈ రాళ్లపైన ఎన్టీఆర్ తో పాటు.. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు , ఎన్టీఆర్ తల్లి శాలిని పేర్లు కూడా విరాళం ఇచ్చినట్లుగా రాశారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు ,వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
ఎన్టీఆర్ పై ప్రశంసలు..
అయితే ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు సైతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఎన్టీఆర్ చాలా సంస్థలకు కూడా విరాళం ఇచ్చారు. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తన బర్తడేను చాలా గ్రాండ్గా చేయడానికి పలు రకాల సన్నహాలను చేస్తూ ఉన్నారు.. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.. ముఖ్యంగా కొరటాల శివతో కలిసి దేవర సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ కి కూడా ఎంట్రీ..
అలాగే బాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా వార్ -2 చిత్రంలో హృతిక్ రోషన్ కు ధీటైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి షూటింగ్ వీడియోలు, ఫోటోలు కూడా లీక్ అవుతూ ఉన్నాయి. ఇవే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా మరొక సినిమాని చేసేలా ప్లాన్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా పోయి పాన్ వరల్డ్ ఇమేజ్ కోసం హీరోలందరూ పరితపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరోగా తన స్థానాన్ని సత్యం చేసుకుంటారు చూడాలి. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ గుడికి విరాళం ఇచ్చిన విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది. ఏది ఏమైనా గుడి కోసం ఇన్ని లక్షల విరాళాలు ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నారు ఎన్టీఆర్.
.@tarak9999 Anna Family Donated 12.5 Lakhs for Sri Bhadrakali Veerabhadra Swamy Temple, Jaggannapeta, East Godavari! 🫶♥️#Devara #DevaraFirstSingle pic.twitter.com/PiHKWjnrTi
— 𝗞𝗜𝗥𝗔𝗡 𝗡𝗧𝗥❤🔥 (@cultNTRfan9999) May 14, 2024