Ajay bhupathi: “మంగళవారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ స్టార్ హీరో?

RX100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం “మంగళవారం”. అజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇందులో మెయిన్ లీడ్ గా నటించింది. ఇక హర్ర్ర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ , ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా, సినిమా పాటలు కూడా బాగుండి ఆకట్టుకున్నాయి. ఇక సినిమాని కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రమోషన్ల విషయంలో చాలా ఫోకస్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించడం విశేషం. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజా వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 11 న జరుగనుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ టాప్ హీరో గెస్ట్ గా హాజరవనున్నారని టాక్ నడుస్తుంది.

ఆ టాప్ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్. ఈ విషయమై మేకర్స్ కూడా బన్నీ ని సంప్రదించారని తాను కూడా వెంటనే ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం పై మేకర్స్ నుండి క్లారిటీ రాలేదు కానీ, ఆల్మోస్ట్ ఈ న్యూస్ కంఫర్మ్ అని తెలుస్తుంది. కానీ మేకర్స్ అఫిషియల్ గా క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు