Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న రోజురోజుకూ బాలీవుడ్ లో డిమాండ్ ఉన్న నటిగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాని నటీమణులు బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అయితే రష్మిక మందన్నకు ఈ అవకాశం చాలా త్వరగానే దక్కింది. రష్మిక తన మొదటి బాలీవుడ్ సినిమాలో డైరెక్ట్ గా అమితాబ్ బచ్చన్ తో నటించింది. ఆ తర్వాత రణ్బీర్ కపూర్ తో యానిమల్ లో నటించి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో నటిస్తోంది.
సికందర్ లో రష్మిక..
సల్మాన్ ఖాన్ నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’లో హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికైంది. ఈ సినిమాని ఇండియాలోని అగ్ర దర్శకుల్లో ఒకరైన ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయనున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన నిర్మాత సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు రష్మిక భారీ పారితోషికం తీసుకుంటోందని అంటున్నారు.
రష్మిక రెమ్యూనరేషన్…
సల్మాన్ ఖాన్ తో కలిసి ఈ సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న భారీ పారితోషికాన్ని అందుకుందని అంటున్నారు. గతంలో ఒక్కో సినిమాకు 3-4 కోట్లు పారితోషికం తీసుకుంటోందని టాక్ నడుస్తోంది. అయితే ఆమె ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి చేస్తున్న ‘సికందర్’ సినిమాకు 50% రెట్టింపు పారితోషికం తీసుకుంటోందని అంటున్నారు.
సల్మాన్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇంతే..
సల్మాన్ ఖాన్ సినిమాల్లో నటించే హీరోయిన్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. కేవలం పాటలు, రెండు సీన్లకే పరిమితమవుతారు. కానీ ‘సికందర్’ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అతని సినిమాలలో కథానాయిక పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ సినిమాలో రష్మికకు తన టాలెంట్ చూపించే మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. దానికి తగ్గట్టుగానే రష్మిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
రష్మిక ఖాతాలో అరడజను సినిమాలు..
రష్మిక మందన్న ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘పుష్ప 2’, ‘గర్ల్ఫ్రెండ్’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కొత్త సినిమా అంగీకరించింది. జాకీ ష్రాఫ్తో కలిసి రష్మిక ఓ హిందీ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డిజాస్టర్లలో ఉన్న సల్మాన్…
ఇప్పుడు సల్మాన్ ఖాన్ వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. గత చిత్రం ‘టైగర్ 3’ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్తో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నారు. ‘దబాంగ్’ సినిమా సిరీస్ లో కొత్త సినిమా చర్చ కూడా సాగుతోంది. సల్మాన్ ఖాన్ కి కథ చెప్పానని సుదీప్ చెప్పాడు. అయితే ఆ సినిమా ఎంత వరకు వచ్చిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు మురుగదాస్ తో ‘సికిందర్’ చేస్తున్నారు.