Mangalavaram: నైజాం హక్కులు ఎవరి సొంతం.?

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టాడు అజయ్ భూపతి. ఈ సినిమాకి మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో చూసిన యూత్ కి పిచ్చిపిచ్చిగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

అలానే అజయ్ భూపతి కూడా నాగచైతన్య, రవితేజ వంటి హీరోలకి కూడా కథను నేరేట్ చేసే స్థాయికి వెళ్లిపోయాడు. కొన్ని అనివార్య కారణాలవల్ల అవి వర్కౌట్ కాలేదు. అజయ్ భూపతి చేసిన లాస్ట్ సినిమా “మహాసముద్రం”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విఫలమైంది. ప్రస్తుతం అజయ్ భూపతి చేస్తున్న చిత్రం “మంగళవారం”.

“మంగళవారం” సినిమాలో పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఏదో ఉంది అనే ఒక ఫీల్ అయితే క్రియేట్ చేసింది. దానికి తోడు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ఇంకొంచెం క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 3.4 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు