Dhanush Son Marks : ధనుష్ కొడుకు ఇంటర్ మార్కులు వైరల్… సూర్య కూతురుకే ఎక్కువ మార్క్స్

Dhanush Son Marks : తమిళనాడులో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడిన వేళ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పెద్ద కొడుకు యాత్ర రాజాకు సంబంధించిన మార్కుల వార్త వైరల్ అవుతోంది. 12వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వార్తలతో ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తుతోంది. మరి యాత్ర రాజాకు ఇంటర్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుందాం పదండి.

మార్చి, ఏప్రిల్‌లో ముగిసిన 10వ తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక 10వ తరగతి ఫలితాలు నిన్న వెలువడ్డాయి. తమిళనాడు ఇంటర్ బోర్డు కూడా మూడు రోజుల క్రితం ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో తమిళ స్టార్ ధనుష్ పెద్ద కొడుకు యాత్ర రాజాకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. 12వ తరగతి పరీక్షలో యాత్ర రాజా అత్యధిక మార్కులు సాధించినట్టు సమాచారం.

యాత్ర రాజా మార్కులు..

ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర రాజా మాతృభాషలో 100కి 98, ఇంగ్లీషులో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించారు. అలాగే అతను జీవశాస్త్రంలో 97 మార్కులు సాధించాడు. యాత్ర రాజా మొత్తం మార్కులు 600కి 569. అంటే ధనుష్ పెద్ద కొడుకు ఇంటర్ లో మొత్తం 94.08 శాతం మార్కులతో పాసయ్యాడు. అయితే దీనికి సంబంధించిన అఫిషియల్ సమాచారం ఇంకా అందలేదు.

- Advertisement -

సూర్య కూతురు దియా మార్కులు..

కాగా ఈ నేపథ్యంలోనే ధనుష్ కొడుకు యాత్ర రాజా మార్కులను సూర్య కూతురు మార్కులతో పోలుస్తున్నారు నెటిజన్లు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూతురు దియా ఈ ఏడాదే 12వ తరగతి పరీక్ష రాసింది. తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడి కాగా, దియా మార్కులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, అకౌంట్స్‌లో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులను దియా సాధించడం విశేషం. దియా ఇంటర్ లో 600 మార్కులకు గాను 581 మార్కులు సంపాదించినట్టు సమాచారం.

ధనుష్ తన కొడుకు 12వ పరీక్ష ఫలితాల గురించి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. ప్రస్తుతం యాత్రకు 18 సంవత్సరాలు. అతను చెన్నైలోని ఒక ప్రతిష్టాత్మక పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అతని తమ్ముడు లింగ కూడా అదే పాఠశాలలో చదువుతున్నాడు.

చిన్న ఏజ్ లోనే కేసులో ఇరుక్కున్న యాత్ర..

2023లో డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా సూపర్ బైక్ నడిపి కేసులో ఇరుక్కున్నాడు యాత్ర. 18 ఏళ్లు కూడా లేని యాత్ర లైసెన్సే లేకుండా బైక్ నడిపి, చెన్నై ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాను కట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. పోయెస్ గార్డెన్‌లో ట్రైనర్‌తో కలిసి యత్ర బైక్ రైడింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా మరోవైపు ధనుష్, ఐశ్వర్య ఇప్పుడు కలిసి లేనప్పటికీ, వారు తమ కొడుకులకు సహ-తల్లిదండ్రులుగా ఉన్నారు. 2022లో ఈ ఇద్దరూ విడిపోతున్నట్టు తమ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు