Big Breaking: ప్రస్తుత కాలంలో స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకుల తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఈ బాటలో ఎంతోమంది సెలబ్రిటీస్ నడిచారు. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ అనంతరం ఇద్దరి మధ్య కలహాలు రావడంతో విడాకులు అనే దారిని ఎంచుకుంటున్నారు. అటువంటి వారి గురించి సోషల్ మీడియాలో కూడా గట్టిగానే వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఇదే బాటలో మరో హీరోయిన్ కూడా నడిచింది.
ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పింది కూడా. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళం స్టార్ హీరోయిన్ భామ. ఈ పేరు గురించి తెలుగు జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ మలయాళం లో మాత్రం సూపర్ హీరోయిన్ గా గుర్తింపుని సంపాదించుకుంది. 2020 లో జగదీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. ఇక తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. వీరికి ఒక పాప కూడా జన్మించింది.
అయితే గత కొంతకాలంగా ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా కూడా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేశారు ప్రేక్షకులు. మొత్తానికి ఆమె విడాకులు తీసుకున్న విషయాన్ని ఓపెన్ గా వెల్లడించింది. పాపతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..” నేను ఇంత స్ట్రాంగ్ అని నాకు ఇంతవరకు తెలియదు. సింగిల్ మదర్ అయినా సరే నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలను. ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. దృఢంగా నిలబడడమే నా ముందున్న వన్ అండ్ ఓన్లీ ఛాయిస్. నాకు నా కూతురు.. నా కూతురికి నేను.. మా ఇద్దరికీ ఇదే ఈ జీవితం ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram