Varalakshmi Sarath Kumar
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా నటించి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ లో విలన్ గా మారి సత్తా చాటుతూ రమ్యకృష్ణ తరువాత అంతే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న ఏకైక నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. తన అందంతో, అద్భుతమైన నటనతో ఎంతో మంది యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యింది. ఇక ఈ మధ్యనే పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హనుమాన్ సినిమాలో హీరో అక్కగా నటించి ఉన్నంతలోనే అదరగొట్టేసింది వరలక్ష్మి శరత్ కుమార్..
ఇకపోతే ఈమధ్య తెలుగులో మంచి మంచి పాత్రలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ 40 సంవత్సరాలకు చేరువవుతున్నా ఇంకా పెళ్లి ఊసు మాత్రం ఎత్తలేదు. ఈ క్రమంలోనే ఈమె వివాహం పై రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. అయితే వాటన్నింటికీ కూడా చెక్ పెడుతూనే ఉంది కానీ ఇప్పుడు మళ్లీ మరో స్టార్ హీరోతో ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. గతంలో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ రూమర్స్ వచ్చాయి. అందులో నిజాన్ని పక్కన పెడితే వీరిద్దరూ ఇప్పటికీ సింగిల్గానే ఉండిపోయారు.
మరొకవైపు ధనుష్ తో పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. అందులో కూడా నిజం లేకపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న శింబుతో ఈమె ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇక అది కూడా త్వరలోనే అంటూ వార్తలు రాగా ఇందులో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.మొత్తానికైతే వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం చేసుకునే వరకు ఇలాంటి రూమర్స్ ఆగవని చెప్పవచ్చు.. ఏది ఏమైనా వరలక్ష్మి మాత్రం వివాహం చేసుకొని జీవితాన్ని వైవాహిక జీవితానికే పరిమితం చేయకుండా తన జీవితంలో మరిన్ని సక్సెస్ లో అందుకోవాలని ప్రయత్నం చేస్తోంది
మరి ఈమె వివాహం గురించి ఎప్పుడు ప్రకటిస్తుందో చూద్దాం.