Jabardasth Rohini: హైపర్ ఆది నా జీవితాన్ని నాశనం చేశాడు… పెళ్లి చేసుకోవాల్సిందే

Jabardasth Rohini : టాలీవుడ్ లో ఒకప్పుడు లేడీ కమెడియన్ల కొరత బాగా ఉండేది. కానీ జబర్దస్త్ పుణ్యమాని లేడీ కమెడియన్లు కూడా వస్తున్నారు. ఆ షో నుండే కాదు పటాస్ లాంటి టెలివిజన్ షో లలో కొత్త కొత్త టాలెంటెడ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ కామెడియన్లలో జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిణి. ఈమె పెర్ఫార్మన్స్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా బాగా ఆఫర్లు అందుకుంటుంది. అందానికి అభినయం కలగలిపిన ఈమె కమెడియన్ గా అనేక టీవీ షోలు చేయడంతో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఈ లేడీ కమెడియన్ తన జీవితాన్ని ఓ వ్యక్తి నాశనం చేశాడని ఏకంగా టీవీ షో స్టేజీమీదే చెప్పుకొచ్చింది. అతడు పెళ్లి చేసుకోకపోతే అస్సలే ఊరుకోను అంటూ తెలిపింది. అయితే రోహిణిని మోహం చేసిన అతడు ఎవరో అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్..

ఇక అసలు విషయానికి వస్తే.. టెలివిజన్ లో జబర్దస్త్ కామెడీ షోతో సూపర్ క్రేజ్ సంపాధించుకున్న రోహిణి(Jabardasth Rohini) అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా తన కామెడీ, మాటతీరుతో అందరినీ మెప్పించిన ఈమె అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ గా మారింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన సేవ్ ది టైగర్స్ లో పనిమనిషిగా కనిపించి తెగ అలరించిన రోహిణి ఇటీవలే హనుమాన్, భీమా సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈమె తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. తన జీవితాన్ని ఓ వ్యక్తి నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. తనకు ఉపాధి కూడా లేకుండా చేసిన అతడే తనను పెళ్లి చేసుకోవాలని.. అప్పుడే తన జీవితం బాగు పడుతుందని కూడా వివరించింది. అయితే ఆమెకు మద్దతుగా యాంకర్ రష్మి, హీరోయిన్ ఇంద్రజ కూడా అండగా ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే రోహిణి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరో కాదు. అతడు కూడా ఓ కమెడియనే. తాజాగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ తతంగం అంతా జరిగింది. అయితే రోహిణి లైఫ్ ను నాశనం చేసింది.. కమెడియన్ హైపర్ ఆదియేనని ఆమె చెప్పుకొచ్చింది.

హైపర్ ఆది పెళ్లి చేసుకోవాలి..

ఇక తాజాగా జరిగిన ఆ షో లో హైపర్ ఆది తనని మోసం చేశాడంటూ రోహిణి చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చూసిన వారు షాక్ అయ్యారు. కానీ తర్వాతే తెలిసింది అసలు కథ. వీరిద్దరూ కలిసి ఓ స్కిట్ చేశారు. అందులో బుగ్గలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునే మహిళగా, రోహిణి కనిపించింది. అలా చిన్న పిల్లల వద్ద అన్నీ అమ్ముకుంటూ ఆమె కామెడీ చేయగా, హైపర్ ఆది తిట్టినట్లు పంచులు వేశాడు. అలా చేస్తే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రోహిణి చెప్పగా, 200 ఇస్తూ మరీ ఆమెపై కామెంట్లు చేశాడు. ఆమె తన వద్ద ఉన్న వస్తువులు అమ్మిన ప్రతీసారి హైపర్ ఆది ఏదో ఒకటి అంటుండడం చూపించారు. ఇలా అతడు తన పొట్టపై కొట్టాడని, తనను ఏమీ అమ్ముకోనివ్వట్లేదని చెప్పుకొచ్చింది. ఇలా తన ఉపాధిని దూరం చేసి, తన జీవితాన్ని హైపర్ ఆది నాశనం చేశాడని తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుని తన జీవితం బాగు చేయాలని కోరింది. అయితే యాంకర్ రష్మితో పాటు ఇంద్రజలు కూడా రోహిణికి అండగా నిలిచారు. నీకు సాయంగా మేముంటామని, ఆది నిన్ను పెళ్లి చేసుకునేలా చూస్తామని చెప్పారు. ఇలా ఆ షో లో ఫన్నీ స్కిట్ లో భాగంగా సాగింది షో. అయితే టివి ప్రోమో లలో చూసే వారు మాత్రం కొందరు ముందు నిజమనుకున్నారు. కానీ తర్వాత షో చూసి షాకయ్యారు. ఇక ఇలాంటి షో లు ఈ మధ్యన కామన్ అయిపోయాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు