Rocking Rakesh.. బుల్లితెరపై గత దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను అలరిస్తూ కడుపుబ్బా నవ్విస్తున్న ఏకైక కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ షోలో కమెడియన్లు చేసే కొన్ని కొన్ని కామెంట్స్ వల్ల ఒక్కొక్కసారి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు… అంతేకాదు హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ లాంటి కమెడియన్స్ కూడా స్టార్ సెలబ్రిటీలపై కామెంట్లు చేయడంతో ఆ స్టార్ హీరోల అభిమానులు వీరికి చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.. కానీ ఇక్కడ పార్టీకి మద్దతు ఇచ్చాడని రాకింగ్ రాకేష్ కి బెదిరింపులు మొదలయ్యాయి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సమాచారం .. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పవన్ ఫ్యాన్స్ నుంచి రాకింగ్ రాకేష్ కి ముప్పు..
ఇకపోతే సాధారణంగా ఎన్నికల సమయంలో సినీ సెలెబ్రిటీలు కూడా తమకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు.. అయితే ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో ఆ సెలబ్రెటీల ఇష్టం.. కానీ జబర్దస్త్ కమెడియన్లలో చాలామంది పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తుండగా ..నగరి నియోజకవర్గంలో రోజా తరఫున రాకింగ్ రాకేష్ ప్రచారం చేయడంతో పాటు వైసీపీకే తమ ఓటు అని కొంతమంది చెబుతున్న వీడియోని నెట్టింట షేర్ చేయడం జరిగింది.. ఇక వైసీపీకి రాకింగ్ రాకేష్ సపోర్ట్ చేయడంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు అవకాశాలు రాకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు.. ఇక పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ లకి భయపడిన రాకేష్.. ఆ వీడియోలను డిలీట్ చేశారు..
పవన్ ఫ్యాన్స్ పై నెటిజన్స్ ఫైర్..
అయితే నెటిజన్లు మాత్రం పవన్ ఫ్యాన్స్ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా పవన్ తరుఫున ప్రచారం చేసే వాళ్ల విషయంలో వైసీపీ ఇలాగే వ్యవహరించిందా? ఇలా వార్నింగ్స్ ఇచ్చిందా? అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.. ఇకపోతే వైసిపి కి మద్దతుగా నిలుస్తున్న రాకేష్ కి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున బెదిరింపు ఫోన్ కాల్స్ తో పాటు కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడంతో ఆయన ప్రచారానికి దూరం అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి నగరి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రోజా.. రాకింగ్ రాకేష్ కు జబర్దస్త్ లో ఉన్నప్పుడు చాలా సహాయపడింది. ఈయనకే కాదు చాలామందికి సహాయపడింది. కానీ అందులో కొంతమంది మాత్రమే ఇలా కృతజ్ఞత చూపుకుంటున్నారు. అలాంటి వారిపై కూడా ఇప్పుడు విమర్శలు గుప్పించడం సరికాదు అని రోజా అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.
కృతజ్ఞత చూపుకున్న రాకేష్..
ఇకపోతే రాకింగ్ రాకేష్ , జోర్దార్ సుజాత ఇద్దరు ప్రేమించుకుని తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు.. రోజా అలాగే ఆమె భర్త పెద్దగా నిలిచి వీరు పెళ్లిని జరిపించారు. ఆ కృతజ్ఞతతోనే వైసీపీ గెలవాలని, రోజా గెలవాలని రాకింగ్ రాకేష్ ప్రచారం చేస్తుండగా ఇప్పుడు ఇలాంటి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.. మరి దీనిపై రోజా కూడా స్పందిస్తుందేమో చూడాలి.