Manchu Vishnu: అంగరంగ వైభోగంగా నవతిహి ఉత్సవం 2024.. డేట్ ఫిక్స్..!

Manchu Vishnu: తెలుగు సినిమా ప్రయాణం 1933లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనితో ఈ 90 ఏళ్ల తెలుగు చిత్ర ప్రయాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకునేందుకు మలేషియా గొప్ప వేదిక కానుంది. నవతిహి ఉత్సవం 2024 పేరిట ఈ సెలబ్రేషన్స్ జరపనున్నారు. మూవీ ఆర్టిస్ట్ ..ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.

మలేషియాలోని కోలౌలంపూర్ లోని బుకీట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టూడియోలో ఈ నవతిహి ఉత్సవం 2024 వేడుకను జరపనున్నారు. ఈ వేడుకను జూలై 20.. 2024న ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నారు. ఈ వేడుక యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకారంగా నిలిచిన వారందరినీ పరిచయం చేస్తూ సంనన్‌వే రిసార్ట్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన లాంచ్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Angaranga Vaibhoganga Navathihi Utsav 2024
Angaranga Vaibhoganga Navathihi Utsav 2024

మూడు దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఎంతో నిశితంగా పరిశీలించిన అనంతరం ఈ ప్రతిష్టాత్మకరమైన ఈవెంట్ ను మలేషియాలో నిర్మించడం జరిగింది. ఇక ఈ వేడుకను మలేషియా టూరిజం, మా, స్థానిక ఈవెంట్ ఆర్గనైజర్ ఎంసీఏ ఎంటర్టైన్మెంట్ తో భాగస్వామ్యం తో ఎంతో ఘనంగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మంచు విష్ణు మరియు పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా హాజరు కావడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈవెంట్ పై మళ్ళింది. ఈ ఈవెంట్ గురించి అనేక విషయాలను తెలుసుకోవడం మొదలుపెట్టారు ప్రజలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు