సర్కారు వారి పాటపై థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎస్ ఎస్ థమన్ ఈ మద్యకాలంలో గట్టిగ వినిపిస్తున్న పేరు ఇది.
కేవలం పేరు మాత్రమే కాదు ఈయన మ్యూజిక్ కూడా గట్టిగ వినిపిస్తుంది
ఎంత గట్టిగా అంటే థియేటర్ యాజమాన్యమే సౌండ్ కొంచెం తగ్గిస్తున్నాం అని నోటిస్ అంటించేంత గట్టిగ వినిపిస్తుంది.యూట్యూబ్ లో ఈయన కంపోస్ చేసిన పాటలు మిలియన్లు దాటుతున్నాయి. కేవలం ఈయన మ్యూజిక్ తో నిలబడిన సినిమాలు కూడా ఉన్నాయ్ అనడంలో అతిశయోక్తి కాదు.అందుకే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని థమన్ ను వెతుక్కుంటూ వస్తాయి.


వరుస సినిమాలతో బిజీగా ఉన్న థమన్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా థమన్ మాట్లడుతూ మహేష్ బాబు గారి సినిమా అంచనాలు అందుకోవడం పెద్ద ఛాలెంజ్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం రెండేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా సర్కారువారి పాట ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

2020 సంక్రాంతికి వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది. గీత గోవిందం లాంటి హిట్ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని పరశురామ్ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేరకు అందుకుంటుందో తెలియాలి అంటే మే 12 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు