Adhipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ నుంచి క్రేజీ న్యూస్

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్  ఏజ్ మీద పడినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా భారీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికీ వరుసగా మూడు చిత్రాలను లైన్ లో పెట్టాడు. ఇక తాజాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్… తెరకెక్కించగా ఈ సినిమాలో సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో చాలా విజయవంతంగా నడుస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా 375 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ సినిమా.

ఇది ఇలా ఉండగా… ప్రభాస్ చేస్తున్న మరో సినిమా సలార్ నుంచి.. ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా సరిగ్గా 100 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జులై 7న గ్రాండ్ గా టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ టీజర్ కూడా థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఆది పురుష్’ రూ. 375 కోట్లు వసూలు చేసింది. కాగా ఆది పురుష్ సినిమా పై…దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలు ఇది రామాయణమా లేక వేరే ఏదైనా తీసారా అని దర్శకుడు పై ఫైర్ అవుతున్నారు. డైలాగ్స్, ప్రధాన తారగణం లుక్స్ పై విపరీతంగా ట్రోల్స్ అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు