Pushpa2: నిండా ముంచిన మేనేజర్.. కీలక నిర్ణయం తీసుకున్న రష్మిక..!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడమే కాదు.. బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను వంటి చిత్రాలలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్, సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలపై ఉన్నాయి.

ఈ క్రమంలోనే రష్మికకు అనుకోని షాక్ తగిలింది. అది కూడా ఆమె మేనేజర్ రూపంలో. ఈ ముద్దుగుమ్మని ఆమె మేనేజర్ మోసం చేశాడట. 80 లక్షల మేర అతడు మోసం చేసినట్లు గుర్తించిన రష్మిక.. వెంటనే అతడిని తొలగించిందట. అంతేకాకుండా తన మేనేజర్ కారణంగానే కొన్ని అద్భుతమైన పెద్ద తెలుగు సినిమాలను మిస్ అయిందట. దీంతో మేనేజర్ ను తొలగించిన రష్మిక తన డేట్స్ తానే మేనేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. తన కెరీర్ ను మేనేజర్ గందరగోళానికి గురి చేశాడని.. మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా ఆమె జాగ్రత్త పడుతోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు పొక్కకుండా చూసుకుంటున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు