Sai Dharam Tej: తల్లి పై సాయి తేజ్ ఎమోషనల్ కామెంట్స్..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్.. నటించింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ సంపత్ నంది తో కలిసి గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉంటారు సాయి ధరమ్ తేజ్. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో కలిసి కొన్ని విషయాలను తెలియజేశారు.

వ్యక్తిగత జీవితంపై స్పందించిన సాయిధరమ్ తేజ్..
ముఖ్యంగా తాను ఇండస్ట్రీలో పడ్డ కష్టాలను కూడా తెలియజేస్తూ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో అన్నిటిని కోల్పోవలసి వస్తుందంటూ తెలిపారు. అలాంటి సమయంలో మన సామ్రాజ్యం మొత్తం కూడా కూలిపోతుందని… ఎగ్జాక్ట్ గా తన కెరియర్లో 2009లో యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకున్నప్పుడు 2010లో యాక్టింగ్ కోర్స్ ని పూర్తి చేసి వచ్చానని అన్నారు. “అలా 2011-12 మధ్య రేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాను. ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మీటింగులకు వెళ్లాలి.. చూస్తే చేతిలో డబ్బులు లేవు.. కారులో డీజిల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లో బ్యాలెన్స్ కూడా ఉండేది కాదు. కేవలం 500 మాత్రమే నా దగ్గర ఉంది దాంతో 450 పెట్టి పెట్రోల్ కొట్టించి 50 రూపాయల తో రీఛార్జ్ చేసుకోవాలనుకున్న ఇక 450 పెట్టి పెట్రోల్ కొట్టించాను. అయితే 50 రూపాయలు డ్రా చేయలేము మినిమం ఉండాలి కానీ ఏదోలాగా ట్రై చేశాను. ఇక బ్యాలెన్స్ చెక్ చేస్తే రూ.2 లక్షలు ఉన్నట్లు చూపిస్తోంది.. ఏం అర్థం కాలేదు.. వెంటనే అమ్మకి ఫోన్ చేశాను.. అప్పుడు అమ్మ మాట్లాడుతూ నువ్వే కదా రాత్రి డబ్బులు లేవని చెప్పావు అందుకే వేశాను ఈ మంత్ సరిపోతుంది కదా అని అడిగింది.. దీంతో ఏటీఎం నుంచి బయటికి వచ్చి చాలా సేపు ఏడ్చాను.. అమ్మ పవర్ ఇలా ఉంటుందా” అంటూ అమ్మ గొప్పదనం గురించి సాయి ధరంతేజ్ తెలియజేశారు.

సాయి ధరంతేజ్ సినిమా విశేషాలు..
తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో నటించిన బ్రో సినిమాతో మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. ప్రస్తుతం గాంజా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పై కూడా టైటిల్ విషయంలో కేస్ నమోదైనట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమాకు నాగ వంశీ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు.. హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ విషయం పైన ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే వెలువడలేదు. మొత్తానికైతే ఆర్థిక ఇబ్బందులను తాను ఎదుర్కొన్నానని వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచారు సాయి ధరంతేజ్.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు