టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఉంటారు. ఈ బ్యూటీ కి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ వచ్చింది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకుంది పూజా హెగ్డే. ఆ తర్వాత టాప్ మోస్ట్ హీరోలతో సినిమాలు చేసి పాపులర్ అయిపోయింది.
పూజ కెరీర్
టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే మహారాష్ట్రలోని ముంబైకి చెందిన భామ అన్న సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలో మాస్క్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత 2014లో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు చేసి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని మెప్పించింది. ఇటు మహర్షి, అరవింద సమేత, గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురంలో సినిమాలతో మంచి విజయాలను అందుకుంది పూజ హెగ్డే.
అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత రాధేశ్యాం సినిమాలో నటించి అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. ప్రభాస్ సినిమా తర్వాత ఆచార్యలో మెరిసింది ఈ బ్యూటీ. ఆచార్య సినిమా కూడా దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత గుంటూరు కారం ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుంటూరు కారం సినిమా లో మొదటగా పూజ హెగ్డేను హీరోయిన్గా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమెను తప్పించి… శ్రీ లీలాను మెయిన్ హీరోయిన్ గా చేశారు.
ఇక ఈ సినిమాలో ఛాన్స్ కోల్పోయిన తర్వాత ఇండస్ట్రీలో పూజా హెగ్డే కి ఛాన్సులు అస్సలు రావడం లేదు. దీంతో గ్లామర్ షోను నమ్ముకుంది పూజ హెగ్డే. ఈ నేపథ్యంలోనే స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లాక్ సారీలో తాజాగా మెరిసింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#PoojaHegde 😘🖤 pic.twitter.com/OVakKaXXmF
— Only Heroines (@OnlyHeroines) March 3, 2024
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify