Ponniyin Selvan2: వచ్చేసిన మోస్ట్ అవైటెడ్ ట్రైలర్

మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. 2022 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దాదాపు 450 కోట్లు వసూలు చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో యావరేజ్ గా ఆడిన ఈ సినిమా తమిళం లో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది.

తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన “పొన్నియన్ సెల్వన్” నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా లో భారీ తారాగణం నటించడం జరిగింది. ఆదిత్య కరికాలుడిగా విక్రమ్, నందిని గా ఐశ్వర్య రాయ్, పొన్నియన్ సెల్వన్ గా యువరాజు పాత్రలో జయం రవి, వల్లవరాయన్ గా కార్తీ, కుందవాయి గా త్రిష నటించారు. ఇంకా ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, జయరాం, రెహమాన్, పార్తీబన్, ప్రభు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఏ. ఆర్ రెహెమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 లో పొన్నియన్ సెల్వన్, వల్లవరాయన్ సముద్రంలో చిక్కుకున్నట్లు చూపించి సినిమా ఎండ్ చేసిన దర్శకుడు, చివరికి బతికారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంచారు. ఈ ట్రైలర్ లో వాళ్ళు బతికే ఉన్నారు అని తెలిసిపోయింది. అంతే కాదు వాళ్ళని కాపాడింది పొన్నిదేవి గా పిలువబడే వ్యక్తి అని, ఆమె ఎవరో కాదు ఐశ్వర్య రాయ్ పోషించిన మరో పాత్ర అని తెలిసింది. ఈ ట్రైలర్ లో విచ్ఛిన్నం అవుతున్న చోళ రాజ్యాన్ని ఒకటి చెయ్యడానికి ఆదిత్య కరికాలుడు యుద్ధం చేస్తున్నట్టు చూపించారు. ఇంకా ట్రైలర్ లో నందిని ఆదిత్య కరికాలుడిని చంపడానికి ప్లాన్ చేస్తున్నట్టు, చోళ రాజ్య యుద్ధ సన్నివేశాలు చూపించడం జరిగింది.

- Advertisement -

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 మరింత ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మధురా టాకీస్ బ్యానర్ లో మణిరత్నం స్వయంగా నిర్మించిన ఈ సినిమా 2023 ఏప్రిల్ 28 న పాన్ ఇండియన్ సినిమాగా విడుదలకు సిద్ధం అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు