Samantha: మరో కొత్త బిజినెస్ .. ఈసారి ఏంటో తెలుసా..?

ఎంతోమంది సినీ తారలు ఇండస్ట్రీలో రాణిస్తూనే వ్యాపార రంగంలో కూడా అడుగుపెడుతూ అక్కడ కూడా రాణిస్తున్నారు. సినిమా స్టార్లు బిజినెస్ లలోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఉన్న స్టార్లందరికీ సొంతంగా బిజినెస్ లు ఉన్నాయి. ఒక్కో సెలబ్రిటీ ఒక్కో బిజినెస్ ని స్థాపించి సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసిన సమంత తాజాగా మరో బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇటీవలే ఈ వ్యాధి నుంచి కోలుకుంది.

తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో బిజినెస్ లోకి అడుగు పెట్టింది సమంత. భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫుడ్ బ్రాండ్ ‘నౌరిష్ యు’ లో సమంత పెట్టుబడులు పెట్టింది. జరోధాకు చెందిన నిఖిల్ కామత్, డార్విన్ బాక్స్ రోహిత్ చెన్నమనేని లు సైతం ‘నౌరిష్ యు’ లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు. ఈ సంస్థ మిల్లెట్ ఫుడ్ ని, మిల్లెట్స్ తో తయారు చేసిన ఫుడ్ ని ఉత్పత్తి చేస్తుంది.

మిల్లెట్ మిల్క్, మిల్లెట్ చిక్కీస్, మిల్లెట్ ఫ్లెక్స్.. ఇలా మిల్లెట్స్ తో తయారు చేసిన పలు రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఈ సంస్థలో సమంత ఇన్వెస్ట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యంతో సమంత వారి బ్రాండ్ మిల్లెట్ మిల్క్ డబ్బాలు పట్టుకుని ఫోజులు ఇచ్చిన ఫోటోని ఇన్వెస్ట్మెంట్ గురు ఇండియా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ న్యూస్ చెప్పగా సమంత దాన్ని షేర్ చేసి ఎస్ అంటూ ట్వీట్ చేసింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు