Ektaa Kapoor : రెండవ బిడ్డను స్వాగతించబోతున్న లేడీ ప్రొడ్యూసర్… ఈసారి కూడా అదే పద్ధతిలోనా?

Ektaa Kapoor : బాలీవుడ్ లేడి ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ రెండవ బిడ్డకు తల్లి కాబోతోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈసారైనా సహజ పద్ధతిలో తల్లి అవుతుందా? లేక మళ్ళీ సరోగసికే వెళ్తుందా ? అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు విషయం ఏంటంటే..

ఏక్తా కపూర్ కు త్వరలో రెండవ బిడ్డ ?

ఇటీవల ఏక్తా కపూర్ రెండవ సారి అద్దె గర్భం సరోగసి ద్వారా తల్లి కాబోతోందని, ఈ పాపులర్ లేడి ప్రొడ్యూసర్ తన 5 ఏళ్ల కొడుకు రవికి తోబుట్టువు కావాలంటూ రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి ఏక్తా తల్లిదండ్రులు జీతేంద్ర, శోభా కపూర్ కూడా సపోర్ట్ చేస్తున్నారని ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా మరోసారి సరోగసి ద్వారా ఏక్తా కపూర్ రెండవ బిడ్డను స్వాగతించబోతున్నారు అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

సెకండ్ చైల్డ్ రూమర్స్ పై ఏక్తా కపూర్ స్పందన

అయితే ఏక్తా కపూర్‌ సన్నిహితులలో ఒకరు ఆమె రెండవ బిడ్డ వార్తలను ఫేక్ న్యూస్ అంటూ తోసిపుచ్చింది. ఓ మీడియాతో మాట్లాడుతూ అటువంటి వార్తలను ప్రచురించే ముందు ఒక్కసారి నిజానిజాలు ఏంటో తెలుసుకుని చేస్తే బాగుంటుందని చురకలంటించారు. “వ్యూస కోసం ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. గౌరవప్రదమైన జాబ్ లో ఉన్న జర్నలిస్టులు ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఇలాంటి ఫేక్ న్యూస్ విన్నప్పుడు ఒక్కోసారి నవ్వొస్తుంది” అంటూ ఏక్తా సన్నిహితులు ఫేక్ వార్తలపై ఫైర్ అయ్యారు.

- Advertisement -

ఏక్తా కపూర్ ఫస్ట్ బేబీ

ఏక్తా కపూర్ తన మొదటి బిడ్డ రవి కపూర్ కు 2019లో తల్లి అయ్యింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఆమె కొడుకుకు అతని తాత, ఏక్తా తండ్రి, ప్రముఖ నటుడు, నిర్మాత జీతేంద్ర పేరు పెట్టారు. జితేంద్ర అసలు పేరు రవి కపూర్. ఏక్తా ఇటీవల జనవరిలో రవి కోసం గ్రాండ్ గా ఐదవ పుట్టినరోజు వేడుకను నిర్వహించింది.

ఏక్తా సోదరుడిది కూడా ఇదే దారి

ఏక్తా మాత్రమే కాదు ఆమె సోదరుడు, నటుడు తుషార్ కపూర్ కూడా అద్దె గర్భం ద్వారా తన కొడుకును పొందారు. ఏక్తా మొదటి బిడ్డను స్వాగతించిన అదే ఏడాది తుషార్  కూడా సరోగసీ మార్గం ద్వారా ఫస్ట్ బేబీని తన జీవితంలోకి ఆహ్వానించాడు.

ఏక్తా కపూర్ సినిమాలు

2023లో ఏక్తా కపూర్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ప్రతిష్టాత్మకమైన డైరెక్టరేట్ అవార్డును పొందిన భారతదేశపు మొదటి మహిళా చిత్ర నిర్మాతగా చరిత్రను సృష్టించింది. ఏక్తా నిర్మిస్తున్న సినిమాల విషయానికొస్తే..  ఏక్తా కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించిన క్రూ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరీనా కపూర్, టబు, కృతి సనన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఆమె నిర్మించిన మరో మూవీ LSD 2: లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2 కూడా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. ది సబర్మతి రిపోర్ట్ కు కూడా ఆమె నిర్మాత. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు