Samantha: దసరా తో పాటు శాకుంతలం

టాలీవుడ్ బ్యూటీ సమంత లేటెస్ట్ గా నటించిన సినిమా “శాకుంతలం”. ఈ సినిమా సమ్మర్ కానుక గా ఏప్రిల్ 14 న పాన్ ఇండియా సినిమా గా వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతేగాక ఈ సినిమా ని గుణ టీం వర్క్స్ బ్యానర్ లో ఆయనే స్వయంగా 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఇందులో సమంత “శకుంతల” గా మెయిన్ లీడ్ లో నటించగా, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో నటించారు. ఇంకా దేవ్ మోహన్,
జిష్షు సేన్ గుప్తా, గౌతమి, అనన్య నాగళ్ళ, సుబ్బరాజు, మధుబాల, హరీశ్ ఉత్తమన్, కబీర్ బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే ఈ సినిమా కి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని మార్చి 30 న విడుదల అవుతున్న దసరా సినిమాతో పాటు కలిపి ప్రదర్శిస్తున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అంతే కాదు ఈ సినిమాను 3D లో కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -

దసరా సినిమాతో కలిపి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా దిల్ రాజు శాకుంతలం సినిమా లో ఎంటర్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఊపందుకున్నాయనే చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు