Samantha: వైసీపీ కోసం రంగంలోకి సమంత ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత 14 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ గానే సమంత కొనసాగుతోంది. తన కెరీర్ లో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కూడా సినిమాలు చేస్తోంది.

వైసీపీ కోసం సమంత

ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఏ క్షణమైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం కూడా మొదలుపెట్టేసాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి దెబ్బకొట్టేందుకు జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు జతకట్టాయి. ఇప్పటికే 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించి దూసుకుపోతున్నాయి.

- Advertisement -

అటు అధికార వైసిపి పార్టీ సిద్ధం పేరుతో ముందుకు సాగుతోంది. జిల్లాకు సిద్ధం సభ నిర్వహించి దూసుకుపోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తమ పార్టీకి గ్లామర్ డోస్ అవసరమని భావించిన సీఎం జగన్… సమంతను రంగంలోకి దింపేందుకు చూస్తున్నారట. ఇందుకోసం వైసిపి పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతాను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే సమంతతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీనికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

సమంత అనారోగ్యం

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత…. మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమ వివాహం.. విడాకులు చకచకా జరిగిపోయాయి. సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు సమంత. భయంకరమైన వ్యాధి వచ్చినప్పటికీ కూడా ఇటీవల విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు