Hari Hara Veeramallu Teaser Update : వీరమల్లుతో డైరెక్టర్ వివాదం నిజమే… పోస్టర్‌పై పేరే తొలగించేశారు

Hari Hara Veeramallu Teaser Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చివరగా బ్రో మూవీతో థియేటర్లలోకి వచ్చిన పవన్ కోసం క్యూలో వెయిట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ కూడా పెద్దదే. అయితే ఇటీవల కాలంలో ఆయన నెక్స్ట్ సినిమాల విషయంలో వరసగా అప్డేట్లు వస్తున్నాయి. తాజాగా హరిహర వీరమల్లు మూవీ నుంచి టీజర్ రాబోతుంది అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ధర్మం కోసం యుద్ధం అంటూ మే 2న ఉదయం 9 గంటలకు టీజర్ రిలీజ్ కాబోతుంది అన్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆ పోస్టర్ ను కాస్త గమనిస్తే డైరెక్టర్ పేరు ఎక్కడా కనిపించడం లేదు. ట్వీట్ లో ఆయనను ట్యాగ్ చేశారు కానీ ఆశ్చర్యకరంగా పోస్టర్ లో మాత్రం డైరెక్టర్ పేరు లేదు. అంటే హరిహర వీరమల్లుతో డైరెక్టర్ వివాదం నిజమే అనే విషయం కన్ఫామ్ అయినట్టే అంటున్నారు నెటిజన్లు.

పవన్ తో క్రిష్ విబేధాలు?

క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ మూవీ ఎప్పుడో మొదలైంది. దాదాపు మూడు నాలుగేళ్ళు పూర్తయినా వివిధ కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు అనే వార్త ఎప్పటి నుంచో ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, స్క్రిప్ట్ లో పదేపదే జోక్యం చేసుకోవడం లాంటి విషయాల వల్ల క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కు విసుగు పుట్టి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని రూమర్లు వైరల్ అయ్యాయి.

హరి హర వీరమల్లుని పవన్ కావాలనే అవాయిడ్ చేశాడా?

నిజానికి వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సమయంలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ మూవీ ఇంకా పూర్తి కాలేదు కానీ వకీల్ సాబ్ థియేటర్లలోకి రావడం హిట్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఇన్నేళ్లయినప్పటికీ హరిహర వీరమల్లును పక్కన పెట్టి పవన్ వేరే సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాకే బ్రో మూవీ షూటింగ్ జరగడం కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత పవన్ డైరెక్ట్ గా ఓజీ, ఉస్తాద్ కు డేట్స్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసి, ఓజి సినిమాకు నెలరోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అయిన వీరమల్లుకు డేట్స్ ఇస్తారనుకుంటే ఎలెక్షన్స్ పూర్తయ్యాక కూడా ఓజీ, ఉస్తాద్ సినిమాలకే డేట్స్ ఇచ్చారు పవన్. దీంతో ఈ మూవీ ఆగిపోయిందని వార్తలు రాగా అలాంటిదేమీ లేదని ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన హై ఎండ్ వీఎఫ్ఎక్స్ ప్రోగ్రెస్ లో ఉందంటూ, త్వరలోనే అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా డైరెక్టర్ క్రిష్ మరో మూవీపై ఫోకస్ చేయడంతో నిర్మాత రత్నం తనయుడు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడని వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీజర్ అప్డేట్ రావడం, దానిపై క్రిష్ పేరు లేకపోవడంతో మరోసారి ఈ ప్రాజెక్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ కు, క్రిష్ కు మధ్య విభేదాలు నిజమేనని వార్తలు మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు