Vishwambhara : రమణ గాడి ఇంట్లో “విశ్వంభర” టీం చిందులు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, ఇప్పుడు “విశ్వంభర” టీం అంతా రమణ గాడి ఇంట్లోనే ఆతిథ్యం తీసుకుంటూ, ఏకంగా అక్కడే చిందులు వేస్తున్నారు. మరి ఇంతకీ “గుంటూరు కారం”తో “విశ్వంభర” కనెక్షన్ ఏంటి? రమణ గాడి ఇంట్లో చిరు ఏం చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే…

“విశ్వంభర” లేటెస్ట్ అప్డేట్…
చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర”. “బింబిసార” ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై ఇప్పటికే హైప్ గ్రాఫ్ వేరే లెవెల్ అన్నట్టుగా ఉంది. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు టైటిల్ గ్లింప్స్ తోనే అంచనాలను భారీగా పెంచేసింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న “విశ్వంభర” 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ అంతా హైదరాబాద్ లో వేసిన 13 భారీ సెట్లలోనే జరగబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా “విశ్వంభర” టీం అంతా రమణ గాడి ఇంట్లో తిష్ట వేశారు. సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్లు అందరూ కలిసి అక్కడే ఆటపాటలతో సందడి చేస్తున్నారు అనేది తాజా సమాచారం.

“గుంటూరు కారం” సెట్ లో “విశ్వంభర” టీం
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “గుంటూరు కారం” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించగా, ఇందులో ఆయన పాత్ర పేరు రమణ. ఈ సినిమాలో మహేష్ బాబు తన తల్లికి దూరంగా, గుంటూరులో తన తండ్రి, అత్తతో కలిసి నివసిస్తాడు. ఇప్పటికీ అందరికీ రమణ గాడి ఇల్లు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే ఇంట్లో “విశ్వంభర” టీం షూటింగ్ జరుగుతోంది. “గుంటూరు కారం” కోసం వేసిన ఇంటి సెట్ లో చిరంజీవి, త్రిషపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శోభి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండగా, ఈ సాంగ్ లో చిరు, త్రిషతో పాటు సినిమాలో నటించే ప్రధాన తారాగణం అంతా కనిపించబోతున్నారని సమాచారం. అందులో భాగంగానే “విశ్వంభర”లో నటిస్తున్న మరో ముగ్గురు హీరోయిన్లు ఆశికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించబోతుందని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

“విశ్వంభర”లో చిరు రోల్ ఇదే…
ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో మెగాస్టార్ చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నలుగురు యంగ్ హీరోయిన్లు ఏంజెల్స్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ముల్లోకాల చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు. కాగా పద్మ విభూషణ్ అందుకున్న తర్వాత రిలీజ్ అవుతున్న చిరు మొదటి మూవీ ఇదే కావడం విశేషం. గత మూవీ “భోళా శంకర్” తో ఊహించని పరాజయాన్ని చవి చూసిన చిరు ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. “విశ్వంభర” షూటింగ్ మొదలైన 6 నెలలకు చిరంజీవి సెట్లో అడుగు పెట్టినప్పటికీ, మేకర్స్ తెలివిగా ఆయన వచ్చే వరకు హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేశారు. ఇక ఇప్పుడు మెయిన్ లీడ్స్ కు సంబంధించిన సన్నివేశాలు, పాటల షూటింగ్ జరుగుతుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు