Venkatesh: “సైంధవ్” లో ఆ సీన్ మాస్టర్ పీస్…- శైలేష్ కొలను

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో “సైంధవ్” కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బోయినపల్లి వెంకట్ నిర్మించాడు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆర్య, నవాజుద్దీన్ సిద్ధికి, ఆండ్రియా, రుహాని శర్మ ప్రత్యేక పాత్రల్లో నటించారు.

ఇక సంక్రాంతికి వస్తున్న సైంధవ్ పై భారీ అంచనాలు ఉండగా, అంచనాలకి తగ్గట్టే పోటీలో కూడా 27 కోట్లకి పైగా బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో సహా అన్నీ మెప్పించగా, పండక్కి యాక్షన్ సినిమాలు ఇష్టపడే మూవీ లవర్స్ కి ఈ సినిమా మంచి ఆప్షన్ గా మారనుంది. తాజాగా ఈ సినిమా కోసం శైలేష్ కొలను ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో సైంధవ్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

ఆ ఇంటర్వ్యూ లో శైలేష్ కొలను మాట్లాడుతూ సైంధవ్ సినిమా నా కెరీర్ లో బెస్ట్ వర్క్.. గా చెప్పుకుంటాను అన్నాడు. సైంధవ్ సినిమాలో ఫ్యాన్స్ అందరూ కొత్త వెంకటేష్ ని చూస్తారని, సైంధవ్ లో సినిమా మొత్తం ఒక ఎత్తు, లాస్ట్ 20 నిమిషాల క్లైమాక్స్ సీన్ మొత్తం ఒక ఎత్తు అన్నాడు. ఆ క్లైమాక్స్ లో వన్ అఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని అన్నాడు. ఇక వెంకీ కెరీర్ లోనే ఇది నిలిచిపోయే సినిమా అవుతుందని శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా టీజర్, ట్రైలర్ తో కామన్ ఆడియన్స్ కి కూడా ఇది వెంకటేష్ సినిమాల్లో మైలు రాయి గా నిలుస్తుందని అనుకుంటున్నారు. మరి శైలేష్ ఆ మాటను నిలుపుకున్నాడో లేదో జనవరి 13న తెలుస్తుంది.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు