Sai Pallavi : సాయి పల్లవి గ్యాప్ ఇవ్వడానికి కారణం అదే…?

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా  సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమైన ఢీ డ్యాన్స్ ప్రోగ్రాంతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మలయాళం ప్రేమమ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం… అలాగే ఇందులో తన నటనతో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈ నటికి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈ నటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినటువంటి ఫిదా మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే దాదాపు ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే కాకుండా కొత్త సినిమాలు కూడా ఏమీ ప్రకటించలేదు సాయి పల్లవి. దీంతో ఆమె మూవీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వైద్య వృత్తిలో స్థిరపడుతుందనే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడానికి గల కారణాలు తెలిపింది. ‘నాకు సినిమాలలో గ్యాప్ రాలేదు. నేనే తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ గ్యాప్ ఎందుకు తీసుకుందో మాత్రం తెలపలేదు సాయి పల్లవి.

- Advertisement -

అయితే సాయి పల్లవి సినిమాలకు గ్యాప్ తీసుకోవడంపై చాలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోయాంబత్తూర్ లో సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్ కలిసి ఒక ఆస్పత్రి నిర్మించారట. ఆ ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయ్యే వరకు సాయి పల్లవి అక్కడే ఉందని, అన్ని సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించారని వార్తలు వచ్చాయి. కాగా, సాయి పల్లవితో పాటు తన చెల్లెలు పూజా కన్నన్ కూడా డాక్టర్ చదివిన సంగతి తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు