Sai Dharam Tej : హిట్ మూవీ సీక్వెల్ పై తేజ్ ఇంట్రెస్ట్… వర్కౌట్ అవుతుందా?

సుప్రీం హీరో సాయి ధరంతేజ్ “విరూపాక్ష” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని దాదాపు ఏడాది కావస్తోంది. కానీ ఇప్పటికీ ఆయన తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నప్పటికీ బడ్జెట్ సమస్యల కారణంగా అవి హోల్డ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా ఈ హీరో గతంలో తాను చేసిన ఒక హిట్ మూవీ సీక్వెల్ లో నటించడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ హీరో చేయబోతున్న సీక్వెల్ ఏ మూవీది? అసలు ఇది వర్కౌట్ అవుతుందా? అంటే…

యాక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. గత ఏడాది వేసవిలో “విరుపాక్ష” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి “బ్రో”తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ మూవీ నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. గత నాలుగు నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా “గాంజా శంకర్” అనే సినిమాను ప్రకటించారు. అయితే కొన్ని రోజుల క్రితం అది కూడా ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపోలేదు, కానీ హీరోయిన్ మారింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “గాంజా శంకర్”. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ రూపొందిస్తున్నారు. సాయి ధరం తేజ్ కు ఇది 17వ సినిమా కాగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా ముందుగా ఈ సినిమాలో పూజ హెగ్డే ను హీరోయిన్ గా అనుకోగా, ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిధి అగర్వాల్ ను తీసుకున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ ఇప్పటిదాకా బయటకు రాలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదంటే హోల్డ్ లో ఉందా? అన్న విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది.

ఇదిలా ఉండగా సాయి ధరం తేజ్ “విరూపాక్ష”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కారణంగానే ఆయన నెక్స్ట్ మూవీ పట్టాలెక్కలేదు అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల క్రితం విడుదలైన తన సూపర్ హిట్ మూవీ “చిత్రలహరి” సీక్వెల్ కి సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 2019లో రిలీజైన “చిత్రలహరి” మూవీకి దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల ప్రస్తుతం సీక్వెల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సీక్వెల్ ను నిర్మించబోతున్నారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ కు, తేజ్ పరిస్థితికి ఈ సీక్వెల్ వర్కౌట్ అవుతుందా? అన్నదే అనుమానం. అలాగే తేజ్ ఇద్దరు కొత్త దర్శకులతో తన నెక్స్ట్ రెండు ప్రాజెక్టులు చేయబోతున్నాడు అని టాక్. అయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. మరోవైపు తేజ్ బరువు తగ్గించుకునే పనిలో పడ్డాడు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు