Game Changer : అక్కడ షూట్ చేసేస్తే గేమ్ ఛేంజర్ ఫినిష్ అయిపోతుందట..!

Game Changer : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజి చిత్రాల్లో “గేమ్ ఛేంజర్” ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం దాదాపు మూడేళ్ళుగా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ దిల్ రాజు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే మూడేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దానికి కారణం ఆగిపోయిందనుకున్న శంకర్ ఇండియన్ 2 మళ్ళీ పట్టాలెక్కడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ నుండి అప్డేట్స్ కూడా రావట్లేదని నిరుత్సాహంగా ఉన్నారు. అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ చరణ్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఈ ఇయర్ లో రీసెంట్ గా గేమ్ చేజర్ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేసారు. ఈ పాటకి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ కూడా రాలేదు. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా జరుపుకుంటూనే ఉండడం గమనార్హం.

ఆ షెడ్యూల్ తో సినిమా పూర్తయ్యే ఛాన్స్ ?

అయితే దర్శకుడు శంకర్ ఓవైపు కోలీవుడ్ లో కమల్ హాసన్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో చేస్తోన్న ఇండియన్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తున్నారు. జూన్ నెలలోనే మూవీ రిలీజ్ కానుంది. అదే విధంగా మధ్యలో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కూడా చేస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ ని కూడా ఇదే ఏడాది జులై లోపే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో పక్కాగా ఉన్నాడు. తాజాగా చెన్నైలో రెండు రోజులు పాటు జరిగిన గేమ్ చేంజర్ షూటింగ్ షార్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. పైగా ఈ షెడ్యూల్ కి దిల్ రాజు చెన్నై కి వెళ్లడం విశేషం. ఇకపై తొందరగా ఫినిష్ అవ్వాలని అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు దిల్ రాజు. ఇక నెక్స్ట్ రాజమండ్రిలో షెడ్యూల్ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ లో ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేయనున్నారట. ఇక రాజమండ్రి షెడ్యూల్ తో ఆల్ మోస్ట్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని సమాచారం.

అంచనాలకు తగ్గట్టు భారీగా..!

ఇక ఈ సినిమా చెన్నై షెడ్యూల్ కి ముందు హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం, ఎయిర్ పోర్ట్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్(Game Changer) షూటింగ్ కంప్లీట్ చేసుకొని RC16పై ఫోకస్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.జె సూర్య ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో నవీన్ చంద్ర, అలాగే సునీల్ కూడా ప్రతినాయకులుగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, ఆరు పాటలున్న ఈ చిత్రంలో సెకండ్ సింగిల్ మే చివరి వారంలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ పాన్ ఇండియా భారీ చిత్రం యొక్క రిలీజ్ డేట్ పై మరో వారం రోజుల్లో దిల్ రాజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు