Jai bhim: నేషనల్ అవార్డ్స్ ఇష్యూ పై మీడియాకి చురకలంటించిన రానా!

Jai bhim:

టాలీవుడ్ లో నేషనల్ అవార్డ్స్ ఇష్యూ పై ఇంకా వేడి చల్లారడం లేదు. ఇండియా వ్యాప్తంగా పలు సినిమాలకి అవార్డులు రాలేదని, ఇంకా కొందరు యాక్టర్లకి ఎందుకొచ్చిందని, నెట్టింట రచ్చ చేస్తూనే ఉన్నారు. తాజాగా సైమా అవార్డుల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దగ్గుపాటి రానా పాల్గొన్నాడు. అయితే అక్కడ కూడా మీడియా ప్రతినిధులు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. పుష్ప లో ఆక్టర్ కి అవార్డు వచ్చింది, కానీ జై భీం సినిమాకి అవార్డు రాలేదని ట్వీట్లు వేస్తున్నారు.

నేషనల్ అవార్డ్స్ వచ్చిన రోజు జై భీం సినిమాకి అవార్డు రాలేదని హీరో నాని తన ఇన్స్టా లో హార్ట్ బద్దలైపోయినట్టు భావోద్వేగం తో స్టేటస్ పెట్టిన విషయాన్నీ గుర్తు చేస్తూ మీడియా ప్రతినిధి నాని లాంటి సెలెబ్రిటీలు ఇలా నెగిటివ్ గా ట్వీట్ చేయడంపై ఏమంటారని అడిగారు. ఆ విషయంపై రానా స్పందిస్తూ, ఇలా అన్నాడు. కొందరికి ఒక సినిమా నచ్చుతుంది. మరికొందరికి ఆ సినిమా నచ్చదు. నటీనటుల అభిరుచులు, ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉంటాయి.

ఇక జైభీమ్ కి అవార్డు రాలేదని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసారు. అంతే కానీ కాంట్రవర్సీ చేయలేదు. మా నటీనటుల మధ్య ఎలాంటి మనస్పర్థలు, వివాదాలు లేవు. దీన్ని మీడియా వాళ్ళే మరీ పెద్దది చేస్తున్నారు. అంటూ మీడియా వాళ్ళకి చురకలందించాడు. ఈ విషయంపై కొందరు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నా, మీడియాకి సెటైర్ వేసాడు కాబట్టి, ఇప్పుడు రానాని వాళ్ళు టార్గెట్ చేస్తారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings,

and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు