#NationalFilmAwards2023: తమిళ తంబీలది ఆవేదనా?, అసూయా..?

#NationalFilmAwards2023

ఇటీవల అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమా నేషనల్ అవార్డ్స్ లో డామినేషన్ చూపించటమే ఇందుకు కారణం అని చెప్పాలి. అంతే కాకుండా 69ఏళ్ళ నేషనల్ అవార్డ్స్ హిస్టరీలో మొదటిసారి తెలుగు హీరో అయిన అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ రావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బెస్ట్ మూవీగా అందరూ ఊహించినట్లే RRR సినిమాకి అవార్డు రాగా, అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే, కోలీవుడ్ వర్గాలు మాత్రం ఆవేదన, ఆక్రోశంతో రగిలిపోతున్నాయి.

తమిళ సినిమాలు జై భీమ్, కర్ణన్, సార్పట్ట పరంపర సినిమాలకు నేషనల్ అవార్డు రాకపోవటం వారి ఆవేదన కారణం అయితే, తెలుగు సినిమా నేషనల్ అవార్డ్స్ లో డామినేట్ చేయటం వారి అసూయకి కారణంగా అనిపిస్తోంది. నిజానికి జై భీమ్ సినిమాకి నేషనల్ అవార్డుకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ సినిమా ఓటీటీలో రిలీజయ్యిందన్న కారణంతోనే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. జై భీమ్ సినిమా ఒక్క తమిళ్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా హోప్స్ ఉన్నాయనటంలో సందేహం లేదు.

- Advertisement -

గతంలో నేషనల్ అవార్డ్స్ విషయంలో టాలీవుడ్ ని చాలా సార్లు తక్కువ చేసి చూసేవారు. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి బిన్నంగా తయారవ్వటంతో తమిళ తంబీలు సహించలేకపోతున్నారు. ఒక పక్క టాలీవుడ్ ర్ర్ర్ తో ముద్దలు పెట్టి వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకోవటం, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ తో సత్తా చాటడంతో తమిళ తంబీల బాధ వర్ణనాతీతంగా మారిందని చెప్పచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు